రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి దుర్మరణం

Software Employee Died In Road Accident - Sakshi

ధర్మవరం రూరల్‌: మండల పరిధిలోని గరుడంపల్లి సమీపంలోని వంక మలుపు వద్ద ఆదివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మృతి చెందాడు. పోలీసులు, మృతుని బంధువులు తెలిపిన వివరాల మేరకు... ధర్మవరం పట్టణంలోని యాధవ వీధికి చెందిన సుబ్బమ్మ, వెంకటశివ దంపతుల కుమారుడు ఆదిశేషు (28) బెంగళూరులోని ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఇంటి వద్దనే ఉంటూ వర్క్‌ ఫ్రం హోం చేసుకుంటున్నాడు. ఆదివారం తన స్నేహితులు రవితేజ, మంజులతో కలిసి శ్రీశైలానికి కారులో బయలుదేరాడు.

కారు గరుడంపల్లి వంక మలుపు వద్దకు చేరుకోగానే అదుపు తప్పి రోడ్డు పక్కన బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆదిశేషు అక్కడికక్కడే మృతి చెందగా రవితేజ, మంజులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను అనంతపురం సవేరా ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న రూరల్‌ పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. ఆదిశేషు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ధర్మవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చేతికొచ్చిన కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Sri Sathya Sai News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top