● మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి
కోవూరు: నియోజకవర్గ స్థాయిలో పార్టీ కార్యక్రమాలను చురుగ్గా ముందుకు తీసుకెళ్లేందుకు నాయకులు బాధ్యతతో పనిచేయాలని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ రాష్ట్ర పీఏసీ సభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి సూచించారు. పార్టీకి చెందిన వివిధ స్థాయి నాయకులకు ఐడీ కార్డుల పంపిణీ కార్యక్రమం శుక్రవారం నెల్లూరులో జరిగింది. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి, సర్వేపల్లి నియోజకవర్గ పరిశీలకుడు వీరి చలపతిరావు, మండలాల క న్వీనర్లు షేక్ షాహుల్, చెర్లో సతీష్రెడ్డి, కాటంరెడ్డి నవీన్రెడ్డి, చిమటా శేషగిరి తదితరులు పాల్గొన్నారు.


