దురదృష్టవశాత్తు నా భర్త పాయిజన్ తీసుకున్నాడు. దీంతో మంగళవారం మధ్యాహ్నం జీజీహెచ్కు తీసుకొచ్చి ఐసీయూలో చేర్చాం. ఇంజెక్షన్లు వేశారు. సైలెన్లు పెట్టారు. ఇవన్నీ నర్సులే చేస్తున్నారు. బుధవారం ఉదయం 11 గంటల వరకు కూడా డాక్టర్ రాలేదు. ఎమర్జెన్సీ కేసుకు సంబందించి డాక్టర్ వచ్చి చూడకపోతే ఎలా?
– అఖిల, గుమ్మళ్లదిబ్బ
నర్సులే వైద్యం చేస్తున్నారు
నాకు గుండె సమస్య ఉందని డాక్టర్లు తెలిపారు. ఇంతకుముందు పెద్ద డాక్టర్లతోపాటు చిన్న డాక్టర్లు ఎక్కువగా వచ్చే వారు. ఇప్పుడు నర్సులే వచ్చి వైద్యసేవలందిస్తున్నారు. దీంతో ఇబ్బందిగా ఉంది.
– హజరత్తయ్య,
వృద్ధుడు, ఐసీయూ రోగి


