
ఏంటిది అధ్యక్షా..
బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు మాధవ్ బుధవారం నెల్లూరుకు విచ్చేశారు. ఆ పార్టీ సమావేశం కస్తూర్బా కళాక్షేత్రంలో జరిగింది. ఈ సందర్భంగా వీఆర్సీ నుంచి కస్తూర్బా వరకు ర్యాలీ నిర్వహించారు. దీంతో ఆయా ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. నేతలు, కార్యకర్తల అత్యుత్సాహం వల్ల ఓ ప్రైవేట్ అంబులెన్స్ చిక్కుకుపోయింది. అలాగే వీఆర్సీ వద్ద నడిరోడ్డుపై బాణసంచా కాల్చడంతో అటుగా వెళ్లే వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, నెల్లూరు
ట్రాఫిక్లో చిక్కుకున్న అంబులెన్స్

ఏంటిది అధ్యక్షా..