
30న పది సెంటర్లలో పాలిసెట్ ప్రవేశ పరీక్ష
నెల్లూరు (టౌన్): పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలకు ఈనెల 30న నిర్వహించనున్న ప్రవేశ పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని పాలిసెట్ జిల్లా కోఆర్డినేటర్, ప్రభుత్వ ఉమెన్స్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ సీహెచ్.ఏసుదాసు అన్నారు. సోమవారం స్థానిక ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో పరీక్ష నిర్వహణపై చీఫ్ సూపరింటెండెంట్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 10 సెంటర్లలో పరీక్ష జరుగుతుంది, 4074 మంది విద్యార్థులు హాజరు కానున్నట్లు వెల్లడించారు. పరీక్ష ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగుతుందని చెప్పారు. పరీక్ష కేంద్రంలోకి కాలుక్యులేటర్లు, సెల్ఫోన్లు, స్మార్ట్వాచ్లు నిషేధమన్నారు.
జాతీయ ఖోఖో
పోటీలకు వర్షిణి ఎంపిక
గుడ్లూరు: ఈ నెల 30 నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు ఢిల్లీలో జరగనున్న 67వ అండర్ 19 జాతీయ స్థాయిలో స్కూల్ గేమ్స్ ఖోఖో పోటీలకు రాష్ట్ర జట్టులో గుడ్లూరు మండలం అడవిరాజుపాలెం గ్రామానికి చెందిన కె.వర్షిణి ఎంపికై నట్లు పీఈటీ కవల చిట్టెమ్మ తెలిపారు. వర్షిణి తల్లిదండ్రులైన ధనమ్మ, శ్రీనివాసరావులు రోజువారి కూలీలుగా పని చేస్తున్నారు. వర్షిణికి క్రీడలపై ఉన్న ఆసక్తితో పీఈటీ చిట్టెమ్మ ద్వారా కనిగిరిలో ఖోఖో అకాడమీలో చేర్పించారు. రాష్ట్రస్థాయిలో ఖోఖో పోటీలలో ఉత్తమ ప్రతిభను కనబరిచి జాతీయస్థాయి పోటీలకు ఎంపికై ంది.
లోటుపాట్లు లేకుండా
సీఎం పర్యటన
● మంత్రి ఆనం రామనారాయణరెడ్డి
ఆత్మకూరు: సీఎం చంద్రబాబు ఆత్మకూరు పర్యటనలో లోటుపాట్లు లేకుండా సజావుగా జరిగేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. కలెక్టర్, ఎస్పీ ఓ ఆనంద్, కృష్ణకాంత్తో కలిసి సోమవారం సాయంత్రం ఆయన సీఎం పర్యటించే మార్గాలు, ఏర్పాటు చేసిన ప్రోగ్రామ్లను పరిశీలించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు శాఖల వారీగా నివేదికలు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. సీఎం ఏ శాఖ అధికారులతోనైనా రివ్యూ చేసే అవకాశం ఉందన్నారు. ఆయన వెంట తెలుగుగంగ స్పెషల్ కలెక్టర్ హుస్సేన్సాహెబ్, ఆర్డీఓ బి పావని, మున్సిపల్ కమిషనర్ గంగాప్రసాద్, ఆర్అండ్బీ ఎస్ఈ గంగాధర్, హౌసింగ్, డీఆర్డీఏ, మెప్మా పీడీలు పాల్గొన్నారు.
ప్రధాని పర్యటనకు
300 మంది పోలీసులు
నెల్లూరు (క్రైమ్): మే 2న ప్రధానమంత్రి నరేంద్రమోదీ అమరావతి పర్యటన నేపథ్యంలో జిల్లా నుంచి పది మంది ఎస్ఐలు, 60 మంది ఏఎస్ఐ/హెచ్సీలు, 105 మంది కానిస్టేబుళ్లు, 25 మంది మహిళా పీసీలు, 100 మంది హోంగార్డులు మొత్తం 300 మంది బందోబస్తు విధుల్లో పాల్గొనేందుకు సోమవారం పోలీసు కవాతు మైదానం నుంచి ప్రత్యేక వాహనాల్లో తరలివెళ్లారు. ఇదే సమయంలో మే 1న జిల్లాలోని ఆత్మకూరులో సీఎం చంద్రబాబు పర్యటించనున్న నేపథ్యంలో జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. సోమవారం సీఎం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్, కలెక్టర్ ఓ. ఆనంద్, ఎస్పీ జి. కృష్ణకాంత్ ఏర్పాట్లను పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లపై చర్చించారు.

30న పది సెంటర్లలో పాలిసెట్ ప్రవేశ పరీక్ష

30న పది సెంటర్లలో పాలిసెట్ ప్రవేశ పరీక్ష