
రాజ్యాంగ ఫలాలు ప్రజలందరికీ అందాలి
నెల్లూరు(స్టోన్హౌస్పేట): రాజ్యాంగ ఫలాలు ప్రజలందరికీ అందాలి. ఇందుకు సరైన రాజకీయ వ్యవస్థ అవసరం’ అని తిరుపతి ఎంపీ గురుమూర్తి అన్నారు. నగర వైఎస్సార్సీపీ కార్యాలయంలో సోమవారం అంబేడ్కర్ జయంతిని నిర్వహించారు. గురుమూర్తి, పార్టీ సిటీ ఇన్చార్జి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి కలిసి బాబాసాహెబ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పి ంచారు. ఈ సందర్భంగా ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ అంబేడ్కర్ దేశానికి ధృడమైన రాజ్యాంగాన్ని అందించారన్నారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో రెడ్బుక్ పాలనను అమలు చేస్తూ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తోందన్నారు. వారి అరాచకం ఎంతోకాలం సాగదన్నారు.
కండలేరులో 46.661 టీఎంసీలు
రాపూరు: కండలేరు జలాశయంలో సోమవారం నాటికి 46.661 టీఎంసీ నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ విజయకుమార్రెడ్డి తెలిపారు.