జరిమానా విధిస్తున్నా..
లైసెన్స్లు లేని, ట్రాఫిక్ నిబంధనలు పాటించని వాహనదారులపై రవాణా శాఖ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై భారీగా జరిమానాలు విధిస్తున్నారు. గతేడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు మొత్తం 19,867 కేసులు నమోదు చేశారు. వాటిలో లైసెన్స్ లేని వారిపై 3,307, డ్రంక్ అండ్ డ్రైవ్లో 60, ఓవర్ స్పీడ్కు సంబంధించి 7,026, ఓవర్ లోడ్కు సంబంధించి 1,509, ఆపోజిట్ డైరెక్షన్లో వాహనాలు నడపగా 92, రేడియం స్టిక్కర్లపై 1,100, హెల్మెట్ లేని వాహనదారులపై 520, ప్యాసింజర్కు సంబంధించి 111 ఇంకా అనేక వాటి మీద కేసులు నమోదు చేశారు. ఈ కేసులకు సంబంధించి మొత్తం రూ.19 కోట్లు జరిమానాల రూపంలో వసూలు చేశారు. రానున్న రోజుల్లో ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించి లైసెన్స్ లేని, డ్రంక్ అండ్ డ్రైవ్, హెల్మెట్, ఆపోజిట్ డైరెక్టన్ నడపడం, ట్రాఫిక్ రూల్స్ పాటించని వాహనదారులపై కఠిన చర్యలు తీసుకోంటామని రవాణా అధికారులు హెచ్చరిస్తున్నారు.