యూపీ, గుజరాత్‌ మ్యాచ్‌ ‘టై’ | UP Yoddha plays 32 32 tie with Gujarat Giants | Sakshi
Sakshi News home page

Pro Kabaddi: యూపీ, గుజరాత్‌ మ్యాచ్‌ ‘టై’

Dec 30 2021 8:53 AM | Updated on Dec 30 2021 8:54 AM

UP Yoddha plays 32 32 tie with Gujarat Giants - Sakshi

బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్‌లో మరో మ్యాచ్‌ ‘టై’గా ముగిసింది. బుధవారం యూపీ యోధ, గుజరాత్‌ జెయింట్స్‌ హోరాహోరీగా తలపడగా, 32–32 స్కోరుతో మ్యాచ్‌ సమమైంది. యూపీ తరఫున పర్‌దీప్‌ నర్వాల్‌ 11 పాయింట్లతో సత్తా చాటగా...గుజరాత్‌ ఆటగాళ్లలో రాకేశ్‌ నర్వాల్‌ 13 పాయింట్లతో చెలరేగాడు. మరో మ్యాచ్‌లో దబంగ్‌ ఢిల్లీ 52–35 తేడాతో బెంగాల్‌ వారియర్స్‌ను చిత్తు చేసింది.

నవీన్‌ కుమార్‌ అద్భుత ప్రదర్శన ఢిల్లీని గెలిపించింది. అతనొక్కడే 24 పాయింట్లతో దూసుకుపోవడం విశేషం. బెంగాల్‌ ఆటగాళ్లలో కెప్టెన్‌ మణీందర్‌ సింగ్‌ 16 పాయింట్లు సాధించాడు. నేడు జరిగే మ్యాచ్‌లలో జైపూర్‌తో యు ముంబా, హర్యానాతో బెంగళూరు తలపడతాయి.

చదవండి: ఉత్తర్‌ప్రదేశ్‌ కెప్టెన్‌గా కుల్ధీప్‌ యాదవ్‌..

Advertisement
 
Advertisement
Advertisement