పహల్గాం ఉగ్ర‌దాడిని ఖండించిన భార‌త క్రికెట‌ర్లు.. | Virat Kohli, Rohit Sharma and other athletes condemn Pahalgam terror attack | Sakshi
Sakshi News home page

పహల్గాం ఉగ్ర‌దాడిని ఖండించిన భార‌త క్రికెట‌ర్లు..

Apr 23 2025 5:59 PM | Updated on Apr 23 2025 6:18 PM

Virat Kohli, Rohit Sharma and other athletes condemn Pahalgam terror attack

పహల్గాం ఉగ్రదాడి యావత్ దేశాన్ని తీవ్ర విషాదంలో నెట్టింది. మంగళవారం దక్షిణ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రవాదులు విచాక్ష‌ణ‌ర‌హితంగా కాల్పులు జరిపారు. ఈ దారుణ ఘటనలో ఇప్పటి వరకు 27 మంది ప్రాణాలు కోల్పోయారు.  తీవ్రంగా గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

దేశ వ్యాప్తంగా ఈ టెర్ర‌ర్ ఎటాక్‌పై  నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఉగ్ర‌వాదులకు త‌గిన గుణ‌పాఠం చెప్పాల‌ని 140 కోట్ల మంది భార‌తీయ‌లు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఉగ్రదాడి ఘటనను భారత మాజీ, ప్రస్తుత క్రికెటర్లు తీవ్రంగా ఖండించారు. టీమిండియా స్టార్ క్రికెట‌ర్లు విరాట్ కోహ్లి, శుబ్‌మ‌న్ గిల్‌, కేఎల్ రాహుల్‌తో పాటు హెడ్‌కోచ్ గౌతం గంభీర్ మృతుల కుటంబాలకు సంతాపం తెలియజేశారు.

"పహల్గామ్‌లో అమాయక ప్రజలపై జరిగిన దారుణమైన దాడి తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. మృతుల కుటుంబాలకు హృదయపూర్వక సంతాపం తెలియజేస్తున్నాను. ప్రాణాలు కోల్పోయిన వారందరి కుటుంబాలకు ఆ  బలాన్ని చేకూర్చాలని ఆ దేవుడును ప్రార్థిస్తున్నాను"- విరాట్‌ కోహ్లి


"పహల్గామ్‌లో జరిగిన దాడి గురించి తెలిసిన వెంటనే నా హృదయం బరువెక్కిపోయింది. బాధితుల కుటంబాలకు ఆ దేవుడు తోడుగా ఉండాలని ప్రార్ధిస్తున్నాను. ఇలాంటి హింసకు మన దేశంలో చోటు లేదు"- శుబ్‌మన్‌ గిల్‌

"క‌శ్మీర్ ఉగ్ర‌దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. బాధిత కుటుంబాలలకు బలం చేకూరాలని ఆ దేవడును ప్రార్థిస్తున్నాను"-కేఎల్‌ రాహుల్‌

"బాధిత కుటుంబాల కోసం మనమంతా అండగా నిలుద్దాం. ఎవరైతే ఈ  దుశ్చర్యకు బాధ్యులో వారు తప్పకుండా మూల్యం చెల్లించుకుంటారు. తప్పకుండా భారత్ స్ట్రైక్‌ అవుతుంది"-గౌతం గంభీర్‌

👉భార‌త కెప్టెన్ రోహిత్ శ‌ర్మ హార్ట్ బ్రేకింగ్ ఎమోజీల‌ను ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు.

👉పెహ‌ల్గామ్ ఉగ్ర దాడిని ఖండించిన‌ బీసీసీఐ ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఐపీఎల్‌-2025లో ఉప్ప‌ల్ వేదిక‌గా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌, మంబై ఇండియ‌న్స్ మ‌ధ్య జ‌ర‌గ‌నున్న మ్యాచ్‌లో ఆట‌గాళ్లు న‌ల్ల‌టి బ్యాండ్‌లు ధ‌రించి బ‌రిలోకి దిగ‌నున్నారు. అదేవిధంగా  ఈ మ్యాచ్‌ను చీర్‌లీడ‌ర్స్ లేకుండా నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. మ్యాచ్ జ‌రుగుతున్న స‌మ‌యంలో బాణాసంచా కూడా పేల్చ‌వ‌ద్దు అని నిర్ణ‌యించారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement