ఫైనల్లో సౌజన్య జంట | Sowjanya Bavisetti Enter to Finals Womens Tournament | Sakshi
Sakshi News home page

ఫైనల్లో సౌజన్య జంట

Mar 6 2021 5:54 AM | Updated on Mar 6 2021 5:54 AM

Sowjanya Bavisetti Enter to Finals Womens Tournament - Sakshi

న్యూఢిల్లీ: అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) మహిళల టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ అమ్మాయి సౌజన్య బవిశెట్టి డబుల్స్‌ విభాగంలో ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో సౌజన్య–ప్రార్థన తొంబారే (భారత్‌) జోడీ 7–6 (9/7), 3–6, 10–8తో యువరాణి బెనర్జీ–వైదేహి చౌదరీ (భారత్‌) ద్వయంపై విజయం సాధించింది. నేడు జరిగే ఫైనల్లో పియా లవ్రిచ్‌ (స్లొవేనియా)–అడ్రియెన్‌ నాగీ (హంగేరి)లతో సౌజన్య–ప్రార్థన తలపడతారు. మరోవైపు మహిళల సింగిల్స్‌ విభాగంలో హైదరాబాద్‌ అమ్మాయి షేక్‌ హుమేరా క్వార్టర్‌ ఫైనల్లో నిష్క్రమించింది. హుమేరా 4–6, 6–4, 3–6తో జీల్‌ దేశాయ్‌ (భారత్‌) చేతిలో ఓడిపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement