ఫైనల్లో సాత్విక్ –చిరాగ్‌ జోడీ  | Satwik and Chirag pair in the final | Sakshi
Sakshi News home page

ఫైనల్లో సాత్విక్ –చిరాగ్‌ జోడీ 

Jan 21 2024 4:11 AM | Updated on Jan 21 2024 4:11 AM

Satwik and Chirag pair in the final - Sakshi

న్యూఢిల్లీ: ఈ సీజన్‌లో భారత బ్యాడ్మింటన్‌ డబుల్స్‌ జోడీ సాత్విక్ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి వరుసగా రెండో టోర్నమెంట్‌లో ఫైనల్లోకి దూసుకెళ్లింది. గతవారం మలేసియా ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచిన సాత్విక్ –చిరాగ్‌ ద్వయం... తాజాగా ఇండియా ఓపెన్‌లోనూ టైటిల్‌ పోరుకు అర్హత సాధించింది.

శనివారం జరిగిన పురుషుల డబుల్స్‌ సెమీఫైనల్లో సాత్విక్ –చిరాగ్‌ జంట 21–18, 21–14తో ఆరోన్‌ చియా–సో వు యిక్‌ (మలేసియా) జోడీని ఓడించింది. ఆరోన్‌–సో వు యిక్‌లతో ఇప్పటి వరకు 11 సార్లు ఆడిన సాత్విక్ –చిరాగ్‌ మూడోసారి మాత్రమే గెలిచారు. పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్లో ప్రణయ్‌ 15–21, 5–21తో షి యు కీ (చైనా) చేతిలో ఓడిపోయాడు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement