క్వార్టర్‌ ఫైనల్లో సంజీత్, నిశాంత్‌ ఓటమి | Sanjeet And Nishant Defeated Quarter Finals World Boxing Championship | Sakshi
Sakshi News home page

క్వార్టర్‌ ఫైనల్లో సంజీత్, నిశాంత్‌ ఓటమి

Nov 4 2021 8:48 AM | Updated on Nov 4 2021 8:53 AM

Sanjeet And Nishant Defeated Quarter Finals World Boxing Championship - Sakshi

World Boxing Championship.. ప్రపంచ పురుషుల బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు సంజీత్‌ (92 కేజీలు), నిశాంత్‌ దేవ్‌ (71 కేజీలు) క్వార్టర్‌ ఫైనల్లో ఓడిపోయారు. బెల్‌గ్రేడ్‌లో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్‌లో సంజీత్‌ 0–5తో అజీజ్‌ మొహియుద్దీన్‌ (ఇటలీ) చేతిలో... నిశాంత్‌ 1–4తో వాదిమ్‌ ముసయెవ్‌ (రష్యా) చేతిలో ఓడారు. 54 కేజీల విభాగంలో నేడు జరిగే సెమీఫైనల్లో భారత బాక్సర్‌ ఆకాశ్‌ కుమార్‌ కజకిస్తాన్‌కు చెందిన మక్మూద్‌ సమీర్‌ఖాన్‌తో తలపడనున్నాడు.   

Advertisement
 
Advertisement
Advertisement