మార్క్‌రమ్‌ సెంచరీ: దక్షిణాఫ్రికా 314/8 

Markrum century South Africa in good position - Sakshi

వెస్టిండీస్‌ జట్టుతో సెంచూరియన్‌లో మంగళవారం మొదలైన తొలి టెస్టులో తొలి రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 82 ఓవర్లలో 8 వికెట్లకు 314 పరుగులు సాధించింది. ఓపెనర్లలో మార్క్‌రమ్‌ (174 బంతుల్లో 115; 18 ఫోర్లు) సెంచరీ సాధించగా... డీన్‌ ఎల్గర్‌ (118 బంతుల్లో 71; 11 ఫోర్లు) అర్ధ సెంచరీ చేశాడు.

వీరిద్దరు తొలి వికెట్‌కు 141 పరుగులు  జోడించారు. మార్కో జాన్సెన్‌ (17 బ్యాటింగ్‌; 3 ఫోర్లు), కోట్జీ (11 బ్యాటింగ్‌; 2 ఫోర్లు)  క్రీజులో ఉన్నారు. విండీస్‌ బౌలర్లలో అల్జారి జోసెఫ్‌ మూడు వికెట్లు తీసుకున్నాడు.   
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top