Korea Open: సింధు, శ్రీకాంత్‌ జోరు

Korea Open 2022: PV Sindhu Kidambi Srikanth Enters Semi Finals - Sakshi

సన్‌చెయోన్‌: కొరియా ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–500 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత స్టార్‌ షట్లర్లు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్‌ సెమీఫైనల్లోకి అడుగు పెట్టారు. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో సింధు 21–10, 21–16తో బుసానన్‌ (థాయ్‌లాండ్‌)ను ఓడించింది. బుసానన్‌పై సింధుకిది 17వ విజయం కావడం విశేషం.

పురుషుల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో శ్రీకాంత్‌ 21–12, 18–21, 21–12తో సన్‌ వాన్‌ హో (కొరియా) పై గెలిచాడు. పురుషుల డబుల్స్‌ క్వార్టర్‌ ఫైనల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌ –చిరాగ్‌ శెట్టి జోడీ 20–22, 21–18, 20–22తో కాంగ్‌ మిన్‌హుక్‌–సియో సెయుంగ్‌జె (కొరియా) జంట చేతిలో... మహిళల డబుల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప జోడీ 19–21, 17–21తో ఎమ్‌ హై వన్‌–బో రియోంగ్‌ కిమ్‌ (కొరియా) జంట చేతిలో ఓడిపోయాయి. 
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top