Indonesia Open: తొలి రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టిన శ్రీకాంత్, లక్ష్య సేన్‌

Kidambi Srikanth Follows Lakshya Sen in First Round Exit - Sakshi

జకార్తా: ఇండోనేసియా ఓపెన్‌ సూపర్‌–1000 బ్యాడ్మింటన్‌ టోర్నీ లో భారత స్టార్స్, ప్రపంచ 11వ ర్యాంకర్‌ కిడాంబి శ్రీకాంత్, ప్రపంచ పదో ర్యాంకర్‌ లక్ష్య సేన్‌ తొలి రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టారు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో ప్రపంచ మాజీ నంబర్‌వన్‌ శ్రీకాంత్‌ 21–23, 10–21తో ప్రపంచ 41వ ర్యాంకర్‌బ్రైస్‌ లెవెర్‌డెజ్‌ (ఫ్రాన్స్‌) చేతిలో ఓడిపోగా... భారత్‌కే చెందిన ప్రపంచ 23వ ర్యాంకర్‌ ప్రణయ్‌ 21–10, 21–9తో లక్ష్య సేన్‌ను బోల్తా కొట్టించాడు.

గతంలో లెవెర్‌డెజ్‌తో ఆడిన ఐదుసార్లూ గెలిచిన శ్రీకాంత్‌ ఆరోసారి మాత్రం ఓటమి చవిచూశాడు. లక్ష్య సేన్‌పై ప్రణయ్‌కిదే తొలి విజయం కావడం విశేషం. పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్‌లో అర్జున్‌–ధ్రువ్‌ జోడీ 27–25, 18–21, 21–19తో మత్సుయ్‌–టెకుచి (జపాన్‌) జంటపై గెలిచింది.
చదవండి: Asia Cup Qualifiers: సునీల్‌ ఛెత్రీ అరుదైన రికార్డు.. మెస్సీకి రెండు అడుగుల దూరంలో

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top