Virat Kohli becomes first player to complete hundred '30+' score in IPL - Sakshi
Sakshi News home page

#Virat Kohli: కోహ్లి అరుదైన ఫీట్‌.. ఐపీఎల్‌ చరిత్రలో తొలి ఆటగాడిగా

Apr 20 2023 4:40 PM | Updated on Apr 20 2023 5:12 PM

irat Kohli Become-1st-Player-IPL history-Complete Hundred 30-Plus-score - Sakshi

Photo: IPL Twitter

ఆర్‌సీబీ స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లి ఐపీఎల్‌ చరిత్రలో సరికొత్త రికార్డు సాధించాడు. గురువారం పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో డుప్లెసిస్‌తో కలిసి ఓపెనింగ్‌ వచ్చాడు. ఆరంభం నుంచి డుప్లెసిస్‌కు స్ట్రైక్‌ ఇస్తూ తాను కాస్త నెమ్మదిగా బ్యాటింగ్‌ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఇన్నింగ్స్‌ ఏడో ఓవర్లో రాహుల్‌ చహర్‌ బౌలింగ్‌లో మూడో బంతికి రెండు పరుగులు చేయడం ద్వారా 30 పరుగులు సాధించాడు.

ఈ క్రమంలోనే కోహ్లి ఒక రికార్డు అందుకున్నాడు. ఐపీఎల్‌లో '30 ప్లస్‌' స్కోరు చేయడం కోహ్లికి ఇది వందోసారి. ఐపీఎల్‌లో వంద '30 ప్లస్‌' స్కోర్లు నమోదు చేసిన తొలి ఆటగాడిగా కోహ్లి చరిత్రకెక్కాడు. ఇక పంజాబ్‌తో మ్యాచ్‌కు కోహ్లి స్టాండిన్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.

రెగ్యులర్‌ కెప్టెన్‌ ఫాప్‌ డుప్లెసిస్‌ మ్యాచ్‌కు అందుబాటులో ఉన్నప్పటికి కోహ్లి తానే ఈ మ్యాచ్‌కు కెప్టెన్‌గా చేస్తున్నట్లు టాస్‌ సమయంలో తెలిపాడు. ''డుప్లెసిస్‌ ఈరోజు మ్యాచ్‌లో ఫీల్డింగ్‌కు రాడు.. మొదట బ్యాటింగ్‌ చేస్తున్నాం కాబట్టి డుప్లెసిస్‌ నాతో కలిసి బ్యాటింగ్‌కు వస్తాడు. బౌలింగ్‌ సమయంలో మాత్రం డుప్లెసిస్‌ స్థానంలో వైశాక్‌ విజయ్‌కుమార్‌ ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా రానున్నాడు.'' అంటూ తెలిపాడు.

చదవండి: ఇది విన్నారా.. ఐపీఎల్‌ చరిత్రలోనే తొలిసారి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement