Breadcrumb
Live Updates
IPL 2022: ఆర్సీబీ వర్సెస్ సీఎస్కే లైవ్ అప్డేట్స్
సీఎస్కేపై ఆర్సీబీ ఘన విజయం
ఐపీఎల్ 2022లో భాగంగా సీఎస్కేతో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ 13 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. 174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 160 పరుగులు మాత్రమే చేయగలిగింది. డెవన్ కాన్వే 56 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. మొయిన్ అలీ 34 పరుగులు చేశాడు. ఆర్సీబీ బౌలర్లలో హర్షల్ పటేల్ 3, గ్లెన్ మ్యాక్స్వెల్ 2, హాజిల్వుడ్, షాబాజ్ అహ్మద్ ఒక వికెట్ తీశాడు.
17 ఓవర్లలో సీఎస్కే 133/6
17 ఓవర్లు ముగిసేసరికి సీఎస్కే ఆరు వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. 34 పరుగులు చేసిన మొయిన్ అలీ హర్షల్ పటేల్ బౌలింగ్లో సిరాజ్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
17 ఓవర్లలో సీఎస్కే 133/6
17 ఓవర్లు ముగిసేసరికి సీఎస్కే ఆరు వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. 34 పరుగులు చేసిన మొయిన్ అలీ హర్షల్ పటేల్ బౌలింగ్లో సిరాజ్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
సీఎస్కే.. 15 ఓవర్లు 118/4
సీఎస్కే 15 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసింది. క్రీజులో మొయిన్ ఆలీ(21), రవీంద్ర జడేజా(3) ఉన్నారు.
20 ఓవర్లలో ఆర్సీబీ 173/8.. సీఎస్కే టార్గెట్ 174
సీఎస్కేతో మ్యాచ్లో ఆర్సీబీ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. మహిపాల్ లామ్రోర్ 42 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. డుప్లెసిస్ 38, కోహ్లి 30 పరుగులు చేశారు. ఆఖర్లో దినేశ్ కార్తిక్ 17 బంతుల్లో ఒక ఫోర్, 2 సిక్సర్లతో 26 పరుగులతో రాణించాడు. సీఎస్కే బౌలర్లలో మహీష్ తీక్షణ 3, మొయిన్ అలీ 2, ప్రిటోరియస్ ఒక వికెట్ తీశాడు.
ఒకే ఓవర్లో మూడు వికెట్లు డౌన్.. ఆర్సీబీ 157/7
సీఎస్కే బౌలర్ మహీష్ తీక్షణ ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీసి ఆర్సీబీని దెబ్బ తీశాడు. తొలుత 42 పరుగులు చేసిన లామ్రోర్ను ఔట్ చేసిన తీక్షణ.. ఆ తర్వాతి బంతికే హసరంగాను గోల్డెన్ డక్గా పెవిలియన్ చేర్చాడు. ఇక చివరి బంతికి షాబాజ్ అహ్మద్ను ఒక్క పరుగుకే ఔట్ చేశాడు. ప్రస్తుతం ఆర్సీబీ 7 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది.
నాలుగో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ
రజత్ పాటిదార్(21) రూపంలో ఆర్సీబీ నాలుగో వికెట్ కోల్పోయింది. ప్రిటోరియస్ బౌలింగ్లో ముకేశ్ చౌదరీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ఆర్సీబీ 4 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. మహిపాల్ లామ్రోర్ 21, దినేశ్ కార్తిక్ క్రీజులో ఉన్నారు.
డుప్లెసిస్(38) ఔట్.. తొలి వికెట్ డౌన్
సీఎస్కేతో మ్యాచ్లో ఆర్సీబీ తొలి వికెట్ కోల్పోయింది. 38 పరుగులతో మంచి టచ్లో కనిపించిన డుప్లెసిస్ మొయిన్ అలీ బౌలింగ్లో రవీంద్ర జడేజాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ఆర్సీబీ వికెట్ నష్టానికి 62 పరుగులు చేసింది. కోహ్లి 22 పరుగులతో ఆడుతున్నాడు.
3 ఓవర్లలో ఆర్సీబీ 20/0
సీఎస్కేతో మ్యాచ్లో ఆర్సీబీ 3 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 20 పరుగులు చేసింది. కోహ్లి 11, డుప్లెసిస్ 7 పరుగులతో ఆడుతున్నారు.
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సీఎస్కే
ఐపీఎల్ 2022లో బుధవారం ఆర్సీబీ, సీఎస్కే మధ్య ఆసక్తికర పోరు మొదలైంది. టాస్ గెలిచిన సీఎస్కే బౌలింగ్ ఎంచుకుంది. ఆర్సీబీ ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్ల్లో ఐదు విజయాలు... ఐదు ఓటములతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉండగా.. సీఎస్కే తొమ్మిది మ్యాచ్ల్లో 3 విజయాలు.. ఆరు పరాజయాలతో తొమ్మిదో స్థానంలో ఉంది.
గత మ్యాచ్లో సీఎస్కే విజయం ద్వారా తిరిగి ఫామ్లోకి రాగా.. ఆర్సీబీ మాత్రం వరుసగా పరాజయాలు మూటగట్టుకుంది. ఇక ఇరుజట్లు 29 సార్లు తలపడగా.. సీఎస్కే 20సార్లు గెలుపొందగా.. ఆర్సీబీ కేవలం 9 మ్యాచ్ల్లో మాత్రమే విజయాలు చవిచూసింది.
Related News By Category
Related News By Tags
-
IPL 2024: ఆర్సీబీపై సీఎస్కేదే ఆధిపత్యం.. పదహారేళ్లలో..!
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్రికెట్ పండుగ ఇండియన్ ప్రీమియర్ లీగ్ మరి కొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. ఈ సీజన్ తొలి మ్యాచ్ చెన్నైలోని చిదంబరం స్టేడియం (చెపాక్) వేదికగా మార్చి 22న జరుగనుంది...
-
కోహ్లి ఔట్ వెనుక ధోని మాస్టర్ ప్లాన్..
ఐపీఎల్ 2022లో సీఎస్కే ఎట్టకేలకు తొలి విజయం సాధించింది. అదీ మాములుగా కాదు.. డిపెండింగ్ చాంపియన్స్ అనే పదానికి నిర్వచనం చెబుతూ ఆర్సీబీపై భారీ తేడాతో గెలిచి సీజన్లో బోణీ కొట్టింది. వరుసగా నాలుగు పర...
-
IPL 2022: ఆర్సీబీపై సీఎస్కే ఘన విజయం
-
IPL 2024: చెన్నై, ఆర్సీబీ మ్యాచ్కు ముందు వాతావరణం, పిచ్ వివరాలు
ఐపీఎల్ 2024 సీజన్ తొలి మ్యాచ్ ఇవాళ (మార్చి 22) జరుగనుంది. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా ఫైవ్ టైమ్ ఛాంపియన్ చెన్నై సూపర్కింగ్స్ (సీఎస్కే), ఇప్పటివరకు ఒక్క టైటిల్ కూడా గెలవని రాయల్ ఛాలె...
-
IPL 2024: సూపర్ కింగ్స్తో బెంగళూరు తొలి పోరు.. బోణీ కొట్టేది ఎవరు?
క్రికెట్ అభిమానులు ఏంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఐపీఎల్-2024 సమరానికి సమయం అసన్నమైంది. మరో 24 గంటల్లో క్రికెట్ మహాసంగ్రామానికి తెరలేవనుది. తొలి మ్యాచే అభిమానులకు అసలు సిసలైన క్రికెట్ మజా అందనించనుంది...