Breadcrumb
Live Updates
IPL 2022: గుజరాత్ టైటాన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ లైవ్ అప్డేట్స్
లివింగ్స్టోన్, ధావన్ మెరుపులు.. పంజాబ్ కింగ్స్ ఘన విజయం
గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 144 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ 16 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. శిఖర్ ధావన్ 62 పరుగులతో నిలకడ చూపించగా.. ఆఖర్లో లివింగ్స్టోన్ 10 బంతుల్లో 3 సిక్సర్లు, ఒక ఫోర్తో 30 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడి పంజాబ్ విజయాన్ని సులువు చేశాడు. గుజరాత్ బౌలర్లలో షమీ, ఫెర్గూసన్ చెరొక వికెట్ తీశారు.
విజయానికి చేరువగా పంజాబ్ కింగ్స్.. 15 ఓవర్లలో 117/2
గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ విజయానికి చేరువ అయింది. 144 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ 15 ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్ల నష్టానికి 117 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ 62, లివింగ్స్టోన్ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు.
టార్గెట్ 144.. 7 ఓవర్లలో పంజాబ్ కింగ్స్ 58/1
గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ 7 ఓవర్లలో వికెట్ నష్టానికి 58 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ 35, బానుక రాజపక్స 21 పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు జానీ బెయిర్ స్టో ఒక్క పరుగు చేసి ఔటయ్యాడు.
టార్గెట్ 144.. తొలి వికెట్ కోల్పోయిన పంజాబ్
144 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్కు ఆదిలోనే షాక్ తగిలింది. ఒక్క పరుగు మాత్రమే చేసిన జానీ బెయిర్ స్టో మహ్మద్ షమీ బౌలింగ్లో వెనుదిరిగాడు. ప్రస్తుతం పంజాబ్ వికెట్ నష్టానికి 18 పరుగులు చేసింది.
రాణించిన సాయి సుదర్శన్.. గుజరాట్ టైటాన్స్ 20 ఓవర్లలో 143/8
పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. వన్డౌన్లో వచ్చిన సాయి సుదర్శన్ 48 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్తో 65 పరుగులు నాటౌట్ రాణించడంతో గుజరాత్ గౌరవప్రదమైన స్కోరు సాధించింది. సుదర్శన్ మినహా మిగతావారు పెద్దగా రాణించలేకపోయారు. సాహా 21 పరుగులు చేసి ఔటయ్యాడు. పంజాబ్ బౌలర్లలో రబాడ 4 వికెట్లు పడగొట్టాడు.
ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయిన గుజరాత్ టైటాన్స్
పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ వస్తోంది. తాజాగా రబాడ బౌలింగ్లో వరుస బంతుల్లో రాహుల్ తెవాటియా(11), రషీద్ ఖాన్(0)లను వెనక్కి పంపాడు. ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ 6 వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది.
15 ఓవర్లలో గుజరాత్ టైటాన్స్ 98/4
15 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ టైటాన్స్ 4 వికెట్ల నష్టానికి 98 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ 40, రాహుల్ తెవాటియా 7 పరుగులతో ఆడుతున్నారు.
నిరాశపరిచిన హార్దిక్ పాండ్యా.. గుజరాత్ టైటాన్స్ 56/3
9 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ టైటాన్స్ 3 వికెట్ల నష్టానికి 56 పరుగులు చేసింది. సుదర్శన్ 10, మిల్లర్ 8 పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు ఒక్క పరుగు మాత్రమే చేసిన కెప్టెన్ హార్దిక్ పాండ్యా రిషి ధవన్ బౌలింగ్లో జితేశ్ శర్మకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
సాహా(21) ఔట్.. రెండో వికెట్ కోల్పోయిన గుజరాత్ టైటాన్స్
పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ రెండో వికెట్ కోల్పోయింది. 21 పరుగులు చేసిన సాహా రబాడ బౌలింగ్లో మయాంక్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అంతకముందు 9 పరుగులు చేసిన శుబ్మన్ గిల్ రనౌట్గా వెనుదిరిగాడు. సందీప్ శర్మ బౌలింగ్లో లేని పరుగు కోసం ప్రయత్నించిన గిల్ తగిన మూల్యం చెల్లించుకున్నాడు. రిషి ధవన్ డైరెక్ట్ హిట్కు గిల్ వెనుదిరిగాల్సి వచ్చింది. ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ 2 వికెట్ల నష్టానికి 34 పరుగులు చేసింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్ టైటాన్స్
ఐపీఎల్ 2022లో భాగంగా మంగళవారం గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య ఆసక్తికర పోరు జరగనుంది. టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. తొమ్మిది మ్యాచ్ల్లో ఎనిమిది విజయాలు, కేవలం ఒక్క ఓటమితో ఎదురులేకుండా దూసుకెళ్తున్న గుజరాత్ను పంజాబ్ కింగ్స్ ఏ మేరకు నిలువరిస్తుందో చూడాలి.
ఈ సీజన్లో ఇరుజట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్లో గుజరాత్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మరి పంజాబ్ గుజరాత్పై ప్రతీకారం తీర్చుకుంటుందా లేక తలొగ్గుతుందా అనేది చూడాలి
Related News By Category
Related News By Tags
-
హార్దిక్ పాండ్యా కీలక నిర్ణయం
టీమిండియా సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా కీలక నిర్ణయం తీసుకున్నాడు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆదేశాల మేరకు మరోసారి దేశీ క్రికెట్ బరిలో దిగేందుకు సిద్ధమయ్యాడు. ఆసియా టీ20 క...
-
న్యూజిలాండ్తో వన్డే సిరీస్కు టీమిండియా స్టార్లు దూరం!
న్యూజిలాండ్తో వన్డే సిరీస్కు ముందు అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సెలక్షన్ కమిటీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సిరీస్కు భారత స్టార్ ప్లేయర్లు హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రాలకు...
-
వరల్డ్కప్లో టీమిండియా ఫినిషర్ ఎవరు?
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇప్పటికే తమ జట్టును ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో పదిహేను మంది సభ్యులతో కూడిన ఈ జట్టులో నలుగురు ఆల్రౌండర్లక...
-
BCCI: వరల్డ్కప్ టోర్నీకి భారత జట్టు ప్రకటన.. గిల్ అవుట్
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తమ జట్టును ప్రకటించింది. సొంతగడ్డపై జరిగే ఈ ఐసీసీ ఈవెంట్లో పాల్గొనే పదిహేను మంది సభ్యులతో కూడిన వివరాలను శనివారం వెల్లడించింద...
-
హార్దిక్ పాండ్యా ఫాస్టెస్ట్ ఫిఫ్టీ.. తిలక్ విధ్వంసం
సౌతాఫ్రికాతో ఐదో టీ20లో టీమిండియా స్టార్ హార్దిక్ పాండ్యా అదరగొట్టాడు. అహ్మదాబాద్ వేదికగా ఆకాశమే హద్దుగా చెలరేగుతూ ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు. ఈ క్రమంలో కేవలం పదహారు బంతుల్లోనే హార్దిక్ పా...


