ముత్తయ్య మురళీధరన్‌కు యాంజియోప్లాస్టీ

IPL 2021 SRH Muttiah Muralitharan Undergoes Angioplasty - Sakshi

చెన్నై: శ్రీలంక క్రికెట్‌ దిగ్గజం, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు బౌలింగ్‌ కోచ్‌ ముత్తయ్య మురళీధరన్‌కు ఆదివారం యాంజియోప్లాస్టీ నిర్వహించారు. వైద్యులు అతనికి ఒక స్టెంట్‌ను అమర్చారు. ఐపీఎల్‌ మ్యాచ్‌ల కోసం చెన్నైలో ఉన్న మురళీధరన్‌కు ఛాతీలో నొప్పి రావడంతో స్థానిక అపోలో ఆసుపత్రిలో చేరాడు. శనివారమే 49 ఏళ్లు పూర్తి చేసుకున్న మురళీధరన్‌ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యాక మళ్లీ సన్‌రైజర్స్‌ జట్టుతో చేరతాడు.  

చదవండి: అపురూపమైన కానుకతో స్టోక్స్‌కు వీడ్కోలు..
సిరాజ్ మొత్తం మారిపోయాడు: కోహ్లి

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top