Rashid Khan: నితీష్‌ దెబ్బకు కెమెరా పగిలింది.. రషీద్‌ ఏం చేస్తున్నాడు

IPL 2021: Rashid Khan Touching Camera Lens After Nithish Rana Boundary - Sakshi

ఐపీఎల్‌ 2021లో భాగంగా ఆదివారం రాత్రి ఎస్‌ఆర్‌హెచ్‌, కేకేఆర్‌ మధ్య మ్యాచ్‌ జరిగిన సంగతి తెలిసిందే. కాగా కేకేఆర్‌ ఇన్నింగ్స్‌ సమయంలో ఇన్నింగ్స్‌ 17వ ఓవర్లో​ ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. జాసన్‌ హోల్డర్‌ బౌలింగ్‌లో నితీష్‌ రాణా బౌండరీ కొట్టాడు. అయితే బంతి బౌండరీ దాటి పక్కనే ఉన్న కెమెరాకు తాకి లెన్స్‌ పగిలిపోయాయి. అదే స​మయంలో బంతిని అందుకోవడంలో విఫలమైన రషీద్‌ పగిలిన కెమెరాలో వేలు పెట్టి చూశాడు. ఆ తర్వాత ఏంటో ఇది.. అంటూ ఎస్‌ఆర్‌హెచ్‌ ఆటగాళ్లను చూస్తూ నవ్వుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

చదవండి: Glenn Maxwell: ఒకసారి అంటే సరే.. మళ్లీ అదేనా.. ఏంటి మ్యాక్సీ

ఇక మ్యాచ్‌లో కేకేఆర్‌ విజయాన్ని అందుకుంది. 116 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్‌ 4 వికెట్లు కోల్పోయి చేధించింది. శుబ్‌మన్‌ గిల్‌ హాఫ్‌సెంచరీతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ విజయంతో కేకేఆర్‌ ప్లే ఆఫ్స్‌ బెర్తును దాదాపు ఖరారు చేసుకున్నట్లే. రాజస్తాన్‌ రాయల్స్‌తో జరగనున్న చివరి మ్యాచ్‌లో కేకేఆర్‌ విజయం అందుకుంటే ఎలాంటి సమీకరణాలు లేకుండానే నాలుగో జట్టుగా ప్లేఆఫ్స్‌కు చేరనుంది.

చదవండి: ఐపీఎల్‌ 2021 సీజన్‌లో అత్యంత ఫాస్ట్‌బాల్‌.. డెబ్యూ మ్యాచ్‌లోనే

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top