
బ్యాంకాక్: మహిళల స్నూకర్ ప్రపంచకప్ టోర్నమెంట్లో భారత జట్టుకు టైటిల్ లభించింది. అమీ కమాని–అనుపమ రామచంద్రన్లతో కూడిన భారత ‘ఎ’ జట్టు విజేతగా నిలిచింది. ఫైనల్లో అమీ కమాని–అనుపమ జోడీ 56–26, 67–27, 41–61, 27–52, 68–11, 55–64, 78–39తో ఇంగ్లండ్ ‘ఎ’ జట్టుకు చెందిన రీని ఇవాన్స్–రెబెకా కెన్నా ద్వయంపై విజయం సాధించింది.