Ind Vs Eng: భారత్‌, కోహ్లి, పంత్‌, కేఎల్‌ రికార్డులు ఇవే!

IND VS ENG 2nd ODI Team India Kohli Pant KL Rahul Records Stats - Sakshi

పాంటింగ్‌ తర్వాతి స్థానంలో కోహ్లి

యువీ రికార్డును సమం చేసిన పంత్‌

కేఎల్‌ రాహుల్‌ అరుదైన ఘనత

పుణె: ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో అద్భుత విజయం సాధించిన టీమిండియా రెండో మ్యాచ్‌లోనూ భారీ స్కోరు సాధించింది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి(66), కేఎల్‌ రాహుల్‌(108), రిషభ్‌ పంత్‌(77) అద్భుతంగా రాణించడంతో పర్యాటక జట్టుకు 337 పరుగుల లక్ష్యాన్ని విధించింది. ఈ మ్యాచ్‌లో కోహ్లి- రాహుల్‌, రాహుల్‌- పంత్‌ జోడి వందకు పైగా భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. ఈ క్రమంలో పుణె వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో భారత జట్టు, కోహ్లి, రాహుల్‌, పంత్‌ పలు రికార్డులు నమోదు చేశారు. ఆ వివరాలు ఓసారి గమనిద్దాం.

300 వందలకు పైగా స్కోర్లు
టీమిండియా ఆడిన చివరి ఐదు వన్డేల్లో మూడొందలకు పైగా స్కోర్లు చేసింది.
ఆస్ట్రేలియా టూర్‌లో మూడుసార్లు, ఇంగ్లండ్‌పై రెండు వన్డేల్లోనూ ట్రిపుల్‌ సెంచరీ మార్కును దాటింది.
టీమిండియా తన ఆఖరి మూడు వన్డేల్లో చివరి పది ఓవర్లలో 100కు పైగా పరుగులు చేయడం విశేషం.
ఆస్ట్రేలియా చివరి వన్డేతో పాటు ఇంగ్లండ్‌పై వరుసగా రెండు వన్డేల్లోనూ ఈ ఫీట్‌ నమోదు చేశారు

పాంటింగ్‌ తర్వాత కోహ్లినే.. కెప్టెన్‌గా కూడా
వన్డేల్లో కోహ్లి మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి 10 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు.
ఇంగ్లండ్‌పై రెండో వన్డేలో కోహ్లి(66 పరుగులు) ఈ ఘనత సాధించాడు.
పాంటింగ్‌(ఆస్ట్రేలియా) తర్వాత మూడో స్థానంలో అత్యధిక వన్డే పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లి నిలిచాడు.
వన్డే కెప్టెన్‌గా కోహ్లి 5,442 పరుగులు నమోదు చేయడం ద్వారా గ్రేమ్‌ స్మిత్‌(5,416- దక్షిణాఫ్రికా)ను అధిగమించాడు. 
వన్డే కెప్టెన్‌గా అత్యధిక పరుగులు చేసిన జాబితాలో కోహ్లి ఐదో స్థానానికి చేరుకున్నాడు

యువీ రికార్డును సమం చేసిన పంత్‌
వన్డే ఫార్మాట్‌లో ఒక మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై అత్యధిక సిక్సర్లు సాధించిన భారత ఆటగాడు పంత్‌.
ఇంగ్లండ్‌పై పంత్‌(77 పరుగులు) ఈ మ్యాచ్‌లో ఏడు సిక్సర్లు కొట్టాడు
తద్వారా యువరాజ్‌ సింగ్‌(6), ఎంఎస్‌ ధోని(6)ల రికార్డును పంత్‌ అధిగమించాడు.
వన్డే ఇన్నింగ్స్‌లో ఒక భారత వికెట్‌ కీపర్‌ ఇన్ని సిక్సర్లు కొట్టడం ఇది రెండోసారి.
ఈ జాబితాలో ధోని, పంత్‌ కంటే ముందున్నాడు. జైపూర్‌లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ధోని 10 సిక్సులు బాదాడు.
వన్డే ఫార్మాట్‌లో ఐదో స్థానంలో బ్యాటింగ్‌ దిగి అత్యధిక సిక్సర్లు కొట్టిన యువరాజ్‌ సింగ్‌(7) రికార్డును పంత్‌ ఈ మ్యాచ్‌లో సమం చేశాడు.​ 

కేఎల్ రాహుల్‌ అరుదైన రికార్డు
ఇంగ్లండ్‌పై అన్ని ఫార్మాట్లలో సెంచరీ సాధించిన మూడో ఆటగాడిగా కేఎల్‌ రాహుల్‌కు చోటు
క్రిస్‌ గేల్‌, రోహిత్‌ల శర్మల తర్వాత ఆ ఫీట్‌ సాధించిన ఆటగాడు రాహుల్‌
ఈ మ్యాచ్‌లో క్లాసిక్‌ సెంచరీ సాధించడం ద్వారా రాహుల్‌ వన్డే కెరీర్‌లో ఐదో శతకం పూర్తిచేసుకున్నాడు.
36 ఇన్నింగ్స్‌లో రాహుల్‌ ఈ ఘనత సాధించాడు.
రాహుల్‌ కంటే ముందు శిఖర్‌ ధావన్‌(28 ఇన్నింగ్స్‌) ఉన్నాడు.

చదవండి: కోహ్లి అరుదైన రికార్డు.. ఎవరికీ అందనంత దూరంలో!
అద్భుత సెంచరీ.. విమర్శకుల నోళ్లు మూయించాడుగా!
బెన్‌స్టోక్స్‌కు అంపైర్‌ వార్నింగ్‌.. ఏం చేశాడంటే!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top