Photo Credit: Twitter
పసికూన నమీబియా ఇచ్చిన షాక్ నుంచి తేరుకున్న సౌతాఫ్రికా టీ20 ట్రై సిరీస్లో బోణీ కొట్టింది. శనివారం విండ్హోక్ వేదికగా జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లో సౌతాఫ్రికా జట్టు 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. జింబాబ్వే విధించిన 145 పరుగుల టార్గెట్ను సఫారీలు 13.4 ఓవర్లలోనే 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది.
డెవాల్డ్ బ్రెవిస్ (32 బంతుల్లో 75 నాటౌట్, 7 ఫోర్లు, 6 సిక్సర్లు) విధ్వంసం సృష్టించి ఒంటిచేత్తో జట్టుకు విజయాన్ని అందించాడు. ఓపెనర్లు ప్రిటోరియస్ (22), జోర్డాన్ హెర్మన్ (20) పర్వాలేదనిపించారు. జింబాబ్వే బౌలర్లలో బ్రాడ్ ఎవన్స్, బ్లెసింగ్ ముజరబానీ, నైమురి తలా ఒక వికెట్ పడగొట్టారు. అంతకముందు జింబాబ్వే 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది.
ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్ (34) టాప్ స్కోరర్ కాగా, మరుమనీ (13 బంతుల్లో 30, ఒక ఫోర్, మూడు సిక్సర్లు) ఆఖర్లో మెరవడంతో జింబాబ్వే గౌరవప్రదమైన స్కోరును సాధించింది. సౌతాఫ్రికా బౌలర్లలో డాన్ జాసెన్ 3 వికెట్లు తీయగా, సుబ్రయెన్ 2 వికెట్లు పడగొట్టాడు. ఈ విజయంతో సౌతాఫ్రికా సిరీస్లో బోణీ కొట్టగా, తర్వాతి మ్యాచ్ సోమవారం జింబాబ్వే, నమీబియా మధ్య జరగనుంది.
🇿🇦𝐒𝐎𝐔𝐓𝐇 𝐀𝐅𝐑𝐈𝐂𝐀 𝐁𝐄𝐀𝐓 𝐙𝐈𝐌𝐁𝐀𝐁𝐖𝐄 𝐁𝐘 𝟕 𝐖𝐈𝐂𝐊𝐄𝐓𝐒🔥
South Africa chased down 145 with ease, winning by 7 wickets.
🔹️Dewald Brevis — 75 (32)*
🔹️A match-winning knock to finish the chase in style.#SAvZIM #DewaldBrevis pic.twitter.com/LRxxAbmpS0— Sports Nexus (@SportsNexusNews) August 29, 2026


