సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లిన భారత మహిళల జట్టు ఎట్టకేలకు విజయాన్ని అందుకుంది. ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా శనివారం జోహన్నెస్బర్గ్ వేదికగా దక్షిణాఫ్రికా మహిళలతో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్లో టీమిండియా వుమెన్ 14 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. దీప్తిశర్మ ఆల్రౌండ్ ప్రదర్శనతో జట్టుకు విజయాన్ని అందించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. రోడ్రిగ్స్ (43), దీప్తిశర్మ (36 నాటౌట్), రిచా ఘోష్ (34 నాటౌట్) రాణించారు. సౌతాఫ్రికా బౌలర్లలో మారి మార్స్, యాలా రెనెకి చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం 186 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సఫారీలు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 171 పరుగులకు పరిమితమయింది.
ఓపెనర్ సునె లుస్ (40) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా, తంజిమ్ బ్రిట్జ్ 30 పరుగులు చేసింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ 5 వికెట్లు తీయగా, క్రాంతి, చరణి, కశ్వీ గౌతమ్, షెఫాలీ తలా ఒక వికెట్ తీశారు. సిరీస్లో భాగంగా చివరి టీ20 సోమవారం జరగనుంది. ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన దీప్తి శర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. కాగా దీప్తి శర్మ టీ20ల్లో తొలిసారి ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేయడం విశేషం.
4⃣ Overs
1⃣9⃣ Runs
5⃣ fantastic wickets 👏
Deepti Sharma picks up her 𝗠𝗔𝗜𝗗𝗘𝗡 𝗙𝗜𝗩𝗘-𝗪𝗜𝗖𝗞𝗘𝗧 𝗛𝗔𝗨𝗟 in T20Is 🫡
Scorecard ▶️ https://t.co/92BPfF0bsf#TeamIndia | #SAvIND | @Deepti_Sharma06 pic.twitter.com/Kj1CzmR8M7— BCCI Women (@BCCIWomen) April 25, 2026
𝗦𝘁𝗮𝗻𝗱𝗶𝗻𝗴 𝘁𝗮𝗹𝗹 𝗮𝗻𝗱 𝘀𝗵𝗶𝗻𝗶𝗻𝗴 𝗯𝗿𝗶𝗴𝗵𝘁 ✨
Deepti Sharma is adjudged the Player of the Match for her fabulous all-round performance as #TeamIndia clinch victory 🔝👌
Scorecard ▶️ https://t.co/92BPfF0bsf#SAvIND | @Deepti_Sharma06 pic.twitter.com/sYwLVZ2cUm— BCCI Women (@BCCIWomen) April 25, 2026


