క్వార్టర్‌ ఫైనల్లో అనిరుధ్‌ జోడీ | Brisbane Open ATP Challenger-75 Anirudh | Sakshi
Sakshi News home page

క్వార్టర్‌ ఫైనల్లో అనిరుధ్‌ జోడీ

Jan 30 2025 11:33 AM | Updated on Jan 30 2025 12:07 PM

Brisbane Open ATP Challenger-75 Anirudh

సాక్షి, హైదరాబాద్‌: బ్రిస్బేన్‌ ఓపెన్‌ ఏటీపీ చాలెంజర్‌–75 టెన్నిస్ టోర్నీలో హైదరాబాద్‌ ప్లేయర్‌ అనిరుధ్‌ చంద్రశేఖర్‌ పురుషుల డబుల్స్‌ విభాగంలో క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించాడు. ఆ్రస్టేలియాలోని బ్రిస్బేన్‌ నగరంలో జరుగుతున్న ఈ టోరీ్నలో బుధవారం జరిగిన డబుల్స్‌ తొలి రౌండ్‌లో టాప్‌ సీడ్‌ అనిరుధ్‌ (భారత్‌)–చార్లెస్‌ బ్రూమ్‌ (బ్రిటన్‌) ద్వయం 6–4, 6–3తో హేడెన్‌ జోన్స్‌–పావ్లె మారిన్‌కోవ్‌ (ఆ్రస్టేలియా) జోడీపై విజయం సాధించింది. 

మరోవైపు ఫ్రాన్స్‌లో జరుగుతున్న మాంట్‌పెలియర్‌ ఏటీపీ–250 టోరీ్నలో యూకీ బాంబ్రీ (భారత్‌)–అల్బానో ఒలివెట్టి (ఫ్రాన్స్‌) ద్వయం క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లింది. తొలి రౌండ్‌లో యూకీ–ఒలివెట్టి జంట 7–5, 3–6, 10–8తో జేకబ్‌ ష్నయిటర్‌–మార్క్‌ వాల్నర్‌ (జర్మనీ) ద్వయంపై గెలుపొందింది. మరో మ్యాచ్‌లో విజయ్‌ సుందర్‌ ప్రశాంత్‌–జీవన్‌ నెడుంజెళియన్‌ (భారత్‌) జోడీ 1–6, 5–7తో ఫ్లావియో కొ»ొల్లి (ఇటలీ)–జొనాథన్‌ ఎసెరిక్‌ (ఫ్రాన్స్‌) జంట చేతిలో ఓడిపోయింది.  

సహజ, రషి్మక ఓటమి 
పుణే: అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) డబ్ల్యూ75 మహిళల టోర్నమెంట్‌లో భారత నంబర్‌వన్, తెలంగాణ అమ్మాయి సహజ యామలపల్లి, భారతమూడో ర్యాంకర్, తెలంగాణకే చెందిన భమిడిపాటి శ్రీవల్లి రషి్మక పోరాటం ముగిసింది. బుధవారం జరిగిన సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌ల్లో సహజ 4–6, 3–6తో టాప్‌ సీడ్‌ లియోలియా జీన్‌జీన్‌ (ఫ్రాన్స్‌) చేతిలో... రషి్మక 6–7 (2/7), 2/6)తో మూడో సీడ్‌ పన్నా ఉడ్వార్డి (హంగేరి) చేతిలో ఓడిపోయారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement