రేసు గుర్రానికి సెలవిచ్చిన అనుశ్‌ | Asiad Medallist Anush Retires Horse Sir Caramello | Sakshi
Sakshi News home page

రేసు గుర్రానికి సెలవిచ్చిన అనుశ్‌

Jun 27 2025 9:48 AM | Updated on Jun 27 2025 11:58 AM

Asiad Medallist Anush Retires Horse Sir Caramello

న్యూఢిల్లీ: భారత ఈక్వె్రస్టియన్‌ అనుశ్‌ అగర్వల్లా తన విజయాల కోసం సుదీర్ఘకాలంగా శ్రమించిన రేసు గుర్రానికి సెలవిచ్చాడు. సర్‌ కారామెల్లో అనే అశ్వంతో 25 ఏళ్ల అనుశ్‌ చెప్పుకోదగ్గ విజయాలు సాధించాడు. పారిస్‌ ఒలింపిక్స్‌లోనూ పోటీపడ్డాడు. ఆ విశ్వక్రీడల్లో డ్రెస్సెజ్‌ ఈవెంట్‌ను పూర్తి చేసిన తొలి భారతీయ రైడర్‌గా ఘనత వహించాడు. పతకం రౌండ్‌కు అర్హత సాధించలేకపోయినప్పటికీ గ్రూప్‌ ‘ఇ’లో డ్రెస్సెజ్‌ ఈవెంట్‌ పోటీలో తొమ్మిదో స్థానంలో నిలిచాడు. 

ఇలా తన ఒలింపిక్‌ ముచ్చట కూడా తీర్చిన గుర్రం కారామెల్లోకు గురువారం వీడ్కోలు పలికాడు. ‘థ్యాంక్యూ కారామెల్లో... నీవు కేవలం గుర్రానివే కాదు. అంతకుమించి మంచి భాగస్వామివి. నాకెంతో ముఖ్యమైన స్నేహితుడవు కూడా! నీవు నా కలల్నే కాదు... జాతి కలల్ని సాకారం చేశావ్‌. నీవల్లే ఒలింపిక్స్‌కు వెళ్లగలిగాను. మరెంతో మంది ఈక్వె్రస్టియన్లకు ప్రేరణగా నిలిచావు. నిన్ను నేను ఎప్పటికే మర్చిపోను. ఇన్నేళ్లు నా కోసం చెమటోడ్చిన నీకు విశ్రాంతి కావాలనే ఈ నిర్ణయం తీసుకున్నాను. హ్యాపి రిటైర్మెంట్‌ కారామెల్లో’ అని భావోద్వేగంతో సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement