నూతనోత్సాహం | - | Sakshi
Sakshi News home page

నూతనోత్సాహం

Jan 1 2026 1:47 PM | Updated on Jan 1 2026 1:47 PM

నూతనో

నూతనోత్సాహం

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట)/దుబ్బాక: కొత్త సంవత్సరంలోకి అడుగిడిన వేళ నూతనోత్తేజం ఉట్టిపడింది. జిల్లా వ్యాప్తంగా న్యూఇయర్‌ వేడుకలు అంబరాన్నంటాయి. డిసెంబర్‌ 31న విందు, వినోదాలతో ఆనందంగా సందడి చేశారు. 2025కు వీడ్కోలు పలుకుతూ 2026కు స్వాగతం పలికారు. హాటళ్లు, బేకరీ దుకాణాలన్నీ కిటకిటలాడాయి. మద్యం దుకాణా వద్ద కూడా సందడి కనిపించింది. మహిళలు గ్రూప్‌లుగా ఏర్పడి కేక్‌లు కట్‌ చేసి, సంబురాలు నిర్వహించారు. పర్యాటక ప్రదేశాలు కోమటిచెరువు, రంగనాయకసాగర్‌తో పాటుగా ఇతర ప్రాంతాల్లో న్యూ ఇయార్‌ జోష్‌ కనిపించింది. కొన్ని పాఠశాలల్లో ముందస్తుగా కేక్‌ కట్‌ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. బుధవారం రాత్రి 12 గంటల తరువాత ఒకరికొకరు ఆలింగనం చేసుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకొన్నారు. గురువారం జిల్లాలోని ఆలయాలకు భక్తులు భారీగా తరళిరానున్న నేపద్యంలో నిర్వహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

2025కు వీడ్కోలు.. 2026కు స్వాగతం అంబరాన్నంటిన న్యూ ఇయర్‌ వేడుకలు

నూతనోత్సాహం1
1/1

నూతనోత్సాహం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement