అనంతగిరిపల్లి కుంటకు గండి | - | Sakshi
Sakshi News home page

అనంతగిరిపల్లి కుంటకు గండి

Aug 20 2025 9:33 AM | Updated on Aug 20 2025 9:33 AM

అనంతగిరిపల్లి కుంటకు గండి

అనంతగిరిపల్లి కుంటకు గండి

యుద్ధప్రాతిపదికన పూడ్చివేత

వర్గల్‌(గజ్వేల్‌): కుండపోత వానతో అతలాకుతలమైన వర్గల్‌ మండలంలో వరద ఇక్కట్లు కొనసాగుతూనే ఉన్నాయి. మంగళవారం ఉదయం అనంతగిరిపల్లిలోని కిష్టమ్మ కుంటకు భారీ గండి పడింది. గ్రామస్తుల నుంచి సమాచారం అందడంతో పోలీసులతోపాటు ఎంపీడీఓ మచ్చేందర్‌, ఆర్‌ఐ రాజు, ఇరిగేషన్‌ ఏఈ అలీ, అక్కడికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. నీటి వృథాకు అడ్డుకట్ట పడేలా జేసీబీ యంత్రాలతో యుద్ధప్రాతిప్రదికన మరమ్మతులు చేపట్టారు. గండి పూడ్చివేశారు. కాగా వర్గల్‌ మండలంలో మంగళవారం 3.18 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. దీంతో ఇంకా పొలాల్లో వరద వీడలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement