అభివృద్ధి, సంక్షేమానికే ప్రాధాన్యం | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధి, సంక్షేమానికే ప్రాధాన్యం

Apr 22 2025 7:01 AM | Updated on Apr 22 2025 7:01 AM

అభివృ

అభివృద్ధి, సంక్షేమానికే ప్రాధాన్యం

గజ్వేల్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ నరేందర్‌రెడ్డి

గజ్వేల్‌: అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తున్నదని గజ్వేల్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ వంటేరు నరేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం మున్సిపాలిటీ పరిధిలోని మూడో వార్డులో రూ.10లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. గజ్వేల్‌ నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కోరగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రూ.5కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. ఈ నిధులను ప్రాధాన్యత క్రమంలో కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఇంకా ఈ ఈ కార్యక్రమంలో మార్కెట్‌ కమీటీ వైస్‌ చైర్మన్‌ సర్ధార్‌ఖాన్‌, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ గాడిపల్లి భాస్కర్‌, నాయకులు మొనగారి రాజులు, నక్క రాములుగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగడతాం

సీఐటీయూ జిల్లా కార్యదర్శి గోపాలస్వామి

మిరుదొడ్డి(దుబ్బాక): కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగడతామని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కాముని గోపాల స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్బర్‌పేట–భూంపల్లి మండల కేంద్రంలో సోమవారం సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికుల సమావేశం నిర్వహించారు. ఈ సదర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 28న హమాలీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్‌ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా చేపడతామని తెలిపారు. ధర్నా కార్యక్రమానికి హమాలీ కార్మికులు తరలిరావాలని కోరారు. అలాగే మే 20న దేశ వ్యాప్తంగా జరిగే సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం సమ్మె కరపత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు శ్రీనివాస్‌, ఎల్లం, స్వామి, నాగేందర్‌, బాల పోచయ్య తదితరులు పాల్గొన్నారు.

కొత్త ఆవిష్కరణలు అవసరం

కృషికల్ప సీఈఓ సీఎం పాటిల్‌

సిద్దిపేట ఎడ్యుకేషన్‌: ఆవిష్కరణలు కొత్తవి సృష్టించడమే కాకుండా మనం ఎదుర్కొనే సమస్యలకు పరిష్కారాలు ఆలోచించాలని కృషికల్ప సీఈఓ సీఎం పాటిల్‌ అన్నారు. ప్రపంచ ఇన్నోవేషన దినోత్సవం సందర్భంగా సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయంప్రతిపత్తి)లో సోమవారం ఇన్నోవేషన్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టీజీఐసీ ఆతిథ్య సంస్థగా పని చేస్తున్న స్వయంప్రతిపత్తి కళాశాలలో ఇన్నోవేటర్లను గుర్తించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్‌ సునిత, వైస్‌ ప్రిన్సిపల్‌, ఇన్నోవేషన్‌ కోఆర్డినేటర్‌ అయోద్యరెడ్డి, గురుచరణ్‌దాస్‌, ఎంఎస్‌సీ, ఫిషరీస్‌, బోటనీ, జువాలజీ, బీబీఏ విబాగాల విద్యార్థులు పాల్గొన్నారు.

అభివృద్ధి, సంక్షేమానికే ప్రాధాన్యం 1
1/1

అభివృద్ధి, సంక్షేమానికే ప్రాధాన్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement