
రైతులకు నష్టపరిహారం చెల్లించాలి
బీఎస్సీ నియోజకవర్గ ఇన్చార్జి రవీందర్
అక్కన్నపేట(హుస్నాబాద్): అకాల వర్షం వల్ల నేలరాలిన మామిడి, పంటలు దెబ్బతిన్న రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని బీఎస్సీ నియోజకవర్గ ఇన్చార్జి రవీందర్ డిమాండ్ చేశారు. మండలంలోని మల్చెర్వుతుండా, రేగొండ గ్రామా ల్లో ఇటీవల అకాల వర్షంతో దెబ్బతిన్న మామిడితోటలను ఆదివారం ఆయన పరిశీలించారు. అనంత రం మాట్లాడుతూ కంటికి రెప్పలా కాపాడుకుంటున్న మామిడి చెట్లు నేలకొరగడం తీరని నష్టమన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతీసుకొని నష్టపరిహారం త్వరగా వచ్చేలా కృషి చేయాలని కోరారు.