
ఘనంగా ధ్వజస్తంభ ప్రతిష్ఠ
బెజ్జంకి(సిద్దిపేట): మండలంలోని కల్లెపెల్లి లోని వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆలయ ధ్వజస్తంభ ప్రతిష్ఠ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. యంత్ర ప్రతిష్ఠ, పల్లకిసేవ నిర్వహించారు. అనంతరం స్వామి కల్యాణాన్ని అర్చకులు కనుల పండువగా నిర్వహించారు. సమీప గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.
కేసీఆర్, హరీశ్రావు
ఫ్లెక్సీకి క్షీరాభిషేకం
చిన్నకోడూరు(సిద్దిపేట): మండల పరిధిలోని కమ్మర్లపల్లి గ్రామ మధిర కొండెంగలకుంట గ్రామ శివారులోని కుమ్మరికుంట గోదావరి జలాలతో నిండి మత్తడి దూకడంతో ఆదివారం గ్రామస్తులు కేసీఆర్, ఎమ్మెల్యే హరీశ్రావుల ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. హరీశ్రావు ప్రత్యేక చొరవతోనే రంగనాయకసాగర్ నుంచి కాలువల ద్వారా కుమ్మరికుంట నిండిందని సంతో షం వ్యక్తం చేశారు. కొన్నేళ్లుగా బీడుగా ఉన్న కుంట ప్రస్తుతం మండుటెండలో కూడా నిండు కుండలా మారడంతో హరీశ్రావుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మాణిక్యరెడ్డి, ఉపాధ్యక్షుడు పాపయ్య, బీఆర్ ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్, మాజీ సర్పంచ్ కాల్వ ఎల్లయ్య, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఘనంగా ఆలయ వార్షికోత్సవం
మిరుదొడ్డి(దుబ్బాక): అంబేడ్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో పోచమ్మతల్లి ఆలయ రెండో వార్షికోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి భక్తులు బోనాల జాతర, మంగళహారతులతో సామూహిక పూజలు చేశారు. ఒడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకొన్నారు. అనంతరం భక్తులు అన్నదానం చేశారు.
చలివేంద్రం ప్రారంభం
బెజ్జంకి(సిద్దిపేట): మండలంలోని దేవక్కపల్లెలో బాలవికాస సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కోఆర్డినేటర్ సుజాత మాట్లా డుతూ తీవ్రమైన ఎండలతో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులకు గురికాకూడదనే ఉద్దే శ్యంతో చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. వాటి ఏర్పాటుకు ఆర్థికంగా సహకరిస్తున్న దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బాలవికాస ప్రతినిధులు, సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
భక్తులకు
ముత్యాల తలంబ్రాలు
గజ్వేల్రూరల్: భద్రాచల సీతారాముల కల్యా ణోత్సవంలో వినియోగించిన ముత్యాల తలంబ్రాలను గజ్వేల్ ప్రాంత భక్తులకు పంపిణీ చేసేందుకు ఆ ఆలయ అధికారులు రామకోటి భక్తసమాజం వ్యవస్థాపక అధ్యక్షుడు రామ కోటి రామరాజుకు ఆదివారం అందించారు. ఈ సందర్భంగా ఆ ఆలయ ఏఈఓ శ్రావణ్ మాట్లాడుతూ గజ్వేల్ ప్రాంతంలో రామకోటి సంస్థ ద్వారా చేపట్టిన కార్యక్రమాలు అభినందనీయమని, మూడేళ్లుగా తలంబ్రాలను గోటితో వలిచి అందించడం ఆనందంగా ఉందన్నారు. గజ్వేల్ ప్రాంత భక్తులకు అందించేందుకు 100 కిలోల తలంబ్రాలను అందజేశారని చెప్పారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

ఘనంగా ధ్వజస్తంభ ప్రతిష్ఠ

ఘనంగా ధ్వజస్తంభ ప్రతిష్ఠ

ఘనంగా ధ్వజస్తంభ ప్రతిష్ఠ

ఘనంగా ధ్వజస్తంభ ప్రతిష్ఠ