
ధర లేదని పొగాకు పారబోత
దుబ్బాకరూరల్: పొగాకుకు మద్దతు ధర లేకపోవడంతో ఆవేదన చెందిన రైతు రోడ్డుపై పారబోశారు. ఈ సంఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం అప్పనపల్లిలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. అప్పనపల్లి చుట్టు పక్కల గ్రామాలకు చెందిన రైతులు పొగాకును తీసుకు వచ్చి ప్రైవేట్ వ్యాపారులకు విక్రయిస్తారు. గత ఏడాది పొగాకు ధర క్వింటాలుకు రూ.15వేలు ఉండేది. ప్రస్తుతం రూ.6వేలుకు పడిపోయింది. తేమ, రకం బట్టి పొగాకుకు మద్దతు ధర కేటాయిస్తున్నారు. గత ఏడాది కంటే ప్రస్తుతం భారీగా ధర పడిపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. పొగాకును విక్రయించడానికి వచ్చిన ఓ రైతు కనీస మద్దతు ధర లేక పోవడంతో ఆవేదన చెందాడు. కనీసం మద్దతు ధర లేక పోవడంతో ఆగ్రహంతో తాను తెచ్చిన పొగాకును రోడ్డుపై పారబోశాడు. పంటకు పెట్టిన పెట్టుబడి రావడం లేదని కన్నీంటి పర్యంతమయ్యాడు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి దళారుల బారిన పడకుండా పొగాకుకు మద్దతు ధర కేటాయించాలని రైతులు కోరారు.