
మహోన్నత వ్యక్తి అంబేడ్కర్
● ఆయన ముందు చూపు వల్లే తెలంగాణ ● మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు
చిన్నకోడూరు(సిద్దిపేట): అంబేడ్కర్ గొప్ప ఆదర్శనీయుడని, ఆయన ముందు చూపు వల్లే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. సోమవారం మండల పరిధిలోని ఇబ్రహీంనగర్, పెద్దకోడూరులో అంబేడ్కర్ విగ్రహాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు అనుకూలంగా రాజ్యాంగంలో ఆర్టికల్ 3ని ప్రవేశపెట్టారన్నారు. అందుకే కేసీఆర్ రాష్ట్ర సచివాలయానికి అంబేడ్కర్ పేరు పెట్టారన్నారు. ప్రపంచంలోనే ఎత్తయిన కాంస్య విగ్రహాన్ని నగరంలో ఏర్పాటు చేశారన్నారు. దేశ ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించిన మహానాయకుడు అంబేడ్కర్ అన్నారు. కార్యక్రమంలో నాయకులు రాధాకృష్ణ శర్మ, మాణిక్యరెడ్డి, కనకరాజు, సుభాష్, సాయిలు తదితరులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇళ్లలో
అదనపు సాయం మాటేమిటీ?
గజ్వేల్: ఇందిరమ్మ ఇళ్ల పథకంలో దళితులకు రూ.లక్ష అదనంగా సాయం చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఈ అంశంలో ఇప్పటికీ స్పష్టత ఇవ్వడం లేదని హరీశ్రావు మండిపడ్డారు. మండల పరిధిలోని గిరిపల్లిలో సోమవారం రాత్రి అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో హరీశ్రావు మాట్లాడుతూ ఏ పథకం చేపట్టినా సమగ్రంగా అమలు చేయకుండా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి ఇందిరమ్మ ఇళ్ల పథకంలో దళితులకు రూ.లక్ష అదనపు సాయం అందిస్తామని గొప్పగా ప్రకటించగా... ఈ విషయాన్ని ప్రశ్నిస్తే నోరు మెదపడం లేదన్నారు. శాసనసభ ఎన్నికలకు ముందు దళితబంధు సాయాన్ని రూ.12లక్షలకు పెంచుతామని చెప్పి మోసం చేశారని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, ఎస్సీ, ఎస్టీ కమీషన్ మాజీ చైర్మన్ డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కేంద్రంలో వేడుకలు
సిద్దిపేటజోన్: బోధించు.. సమీకరించు... పోరాడు అనే నినాదాలతో సంఘటితం చేసిన అంబేడ్కర్ చూపిన బాటలో మనమంతా పయనించాలని ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా కేంద్రంలో అంబేడ్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవసమాజ నిర్మాణం జరగాలంటే మహాత్మా గాంధీ, జ్యోతిబాపూలే, బాబు జగ్జీవన్రాం, బీఆర్ అంబేడ్కర్ వంటి మహానుభావులు చూపిన మార్గంలో నడవాలన్నారు. అంతకుముందు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, డీఆర్ఓ నాగరాజమ్మ, ఆర్డీఓ సదానందం, దళిత సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మహోన్నత వ్యక్తి అంబేడ్కర్

మహోన్నత వ్యక్తి అంబేడ్కర్