5 ఇసుక లారీల పట్టివేత | - | Sakshi
Sakshi News home page

5 ఇసుక లారీల పట్టివేత

Apr 16 2024 6:45 AM | Updated on Apr 16 2024 6:45 AM

గజ్వేల్‌రూరల్‌: అనుమతులు లేకుండా ఇసుక రవాణాచేస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. అనుమతులు, వే బిల్లులు లేకుండా ఇసుకను తరలిస్తున్న 5లారీలను సోమవారం రాజీవ్‌ రహదారిపై ఫ్లైఓవర్‌ బ్రిడ్జి కింద పట్టుకున్నట్టు వారు తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ అనుమతులు లేకుండా ఇసుక, పీడీఎస్‌ రైస్‌ రవాణా చేసినా, గంజాయి ఇతర మత్తు పదార్థాలు విక్రయించినా, కలిగిఉన్నా చర్యలు తప్పవన్నారు. సమాచారం ఉంటే 8712667445, 87126 67446, 8712667447 నెంబర్లకు తెలియజేయాలని ప్రజలను కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement