కేసీఆర్ చేసిన అభివృద్ధే గెలిపిస్తుంది..
తూప్రాన్: మున్సిపల్ ఎన్నికల్లో మాజీ సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధే బీఆర్ఎస్ నాయకులను గెలిపిస్తుందని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. మంగళవారం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ప్రతి నాయకుడు, కార్యకర్త పార్టీ సూచించిన అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ టిక్కెట్ విషయంలో అఽధిష్టానం ఎవరి పేరు ఖరారు చేస్తే వారే బరిలో ఉండాలని తెలిపారు. కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులను గడప గడపకు తీసుకెళ్లాలన్నారు.
గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి ప్రతాప్రెడ్డి


