పండ్లసాగుపై అధ్యయన పర్యటన
సంగారెడ్డి: మాల్దీవులకు చెందిన 30 మంది పాలన అధికారులు ఫ్రూట్ రీసెర్చ్ స్టేషన్ (ఎఫ్ఆర్ఎస్)ను సోమవారం సందర్శించారు. వారు భారత ప్రభుత్వ విదేశాంగ మంత్రిత్వ శాఖ, మాల్దీవుల ప్రభుత్వం ఆధ్వర్యంలో , జాతీయ గ్రామీణ అభివృద్ధి సంస్థ ( ఎన్ఐఆర్డి ) సహకారంతో నిర్వహించిన అధ్యయన పర్యటనలో భాగంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఫ్రూట్ రీసెర్చ్ స్టేషన్ శాస్త్రవేత్తలు.. మామిడి, జామ, సీతాఫలం ఇతర పండ్ల సాగు విధానాలు, వాటికి తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యలపై అవగాహన కల్పించారు. అలాగే నర్సరీలో మొక్కల పెంపకం, అంటుకట్టు పద్ధతులపై వివరించారు. ఈ కార్యక్రమంలో ఫ్రూట్ రీసెర్చ్ స్టేషన్ ప్రధాన శాస్త్రవేత్త కె.వెంకటలక్ష్మి, శాస్త్రవేత్తలు పి.హరికాంత్, కె.మౌనిక, బి.నవీన్ కుమార్, శిరీష, అరుల్ రాజ్ పాల్గొన్నారు.
ఎఫ్ఆర్ఎస్ను సందర్శించిన మాల్దీవుల బృందం


