సౌతిండియా సైన్స్ఫెయిర్ను విజయవంతం చేయాలి
● ఎస్ఈఆర్టీ డైరెక్టర్ రమేశ్ ● 2026 సైన్ ్స ఫెయిర్ ఏర్పాట్లపై సమీక్ష
రామచంద్రాపురం (పటాన్చెరు): సౌత్ ఇండియా సైన్స్ ఫెయిర్ నిర్వహణ రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్ కంటే భిన్నంగా ఉంటుందని ఎస్ఈఆర్టీ డైరెక్టర్ రమేశ్ పేర్కొన్నారు. ముత్తంగి డివిజన్ పరిధిలోని గాడియం ఇంటర్నేషనల్ స్కూల్లో ఈ నెల 18 నుంచి 23వ తేదీ వరకు జరగనున్న సౌత్ ఇండియా సైన్స్ ఫెయిర్ ఏర్పాట్లపై గురువారం సన్నాహక సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో రాష్ట్ర ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ రమేశ్, జిల్లా అదనపు కలెక్టర్ పాండు, జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా 22 కమిటీలకు సంబంధించిన కన్వీనర్లతో చర్చించారు. ఈ సందర్భంగా ఎస్సీఈఆర్ డైరెక్టర్ రమేశ్ మాట్లాడుతూ... వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే విద్యార్థుల భాష, ఆహార అలవాట్లు, సాంస్కృతిక భిన్నతలను దృష్టిలో ఉంచుకుని కార్యక్రమాలు నిర్వహణ చేయాల్సి ఉంటుందన్నారు. అనంతరం అదనపు కలెక్టర్ పాండు మాట్లాడుతూ...జిల్లాకు వచ్చిన ఈ ప్రతిష్టాత్మక రాష్ట్రస్థాయి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా నోడల్ అధికారి లింభాజీ, జిల్లా సైన్స్ అధికారి సిద్ధారెడ్డి, గాడియం స్కూల్ ఏజీఎం ప్రభాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సమావేశంలో మాట్లాడుతున్న అధికారులు


