లేబర్ కోడ్స్ను రద్దు చేయాలి
పటాన్చెరు: కేంద్ర ప్రభుత్వం రైతు కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని, కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్ను తక్షణమే రద్దు చేయాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కా రాములు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇటీవల విశాఖపట్నంలో జరిగిన సీఐటీయూ 18వ జాతీయ మహాసభలలో సీఐటీయూ అఖిలభారత ఉపాధ్యక్షుడిగా తిరిగి ఎన్నికై న చుక్కా రాములుకు బుధవారం శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ అభినందనలు తెలుపుతూ ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ... విద్యుత్ చట్ట సవరణతో, రైతు చట్టంతో, లేబరుకోడ్స్తో కార్మిక, కర్షక, ప్రజావ్యతిరేక చర్యలకు కేంద్ర ప్రభుత్వం పూనుకొంటున్నదని తక్షణమే ఈ చర్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కా రాములు


