విధుల్లో ప్రాధాన్యత ఇవ్వాలి
ఇంటర్మీడియెట్ విద్యాధికారిని కలిసిన గెజిటెడ్ లెక్చరర్స్
ప్రశాంత్నగర్(సిద్దిపేట): గెజిటెడ్ లెక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ జిల్లా శాఖ సభ్యులు బుధవారం జిల్లా కేంద్రంలో జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి రవీందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. టీజీపీఎస్సీ రిక్రూట్మెంట్ ద్వారా వచ్చిన లెక్చరర్లకు ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించిన సీఎస్డీవో డ్యూటీలు, పేపర్ వాల్యుయేషన్ సీవో, ఏసీవో డ్యూటీలతో పాటు ఇతర డ్యూటీలు ఇచ్చే సందర్భంలో ప్రాధాన్యత ఇవ్వాలని డీఐఈవోకు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు అధ్యక్షుడు రమేశ్ రెడ్డి, గౌరవ అధ్యక్షుడు చంద్రశేఖర్, జనరల్ సెక్రెటరీ వంశీ, ఇతర లెక్చరర్లు పాల్గొన్నారు.


