అటవీ భూమి ఆక్రమణ | - | Sakshi
Sakshi News home page

అటవీ భూమి ఆక్రమణ

Aug 31 2025 8:12 AM | Updated on Aug 31 2025 8:12 AM

అటవీ భూమి ఆక్రమణ

అటవీ భూమి ఆక్రమణ

అడ్డుకున్న అధికారులు.. వాహనాల స్వాధీనం

అడ్డుకున్న అధికారులు.. వాహనాల స్వాధీనం

శివ్వంపేట(నర్సాపూర్‌): అటవీ భూమిని కబ్జా చేసేందుకు చదును చేస్తుండగా అధికారులు అడ్డుకున్నారు. ఈ ఘటన మండల పరిధిలోని పిల్లుట్లలో శనివారం చోటు చేసుకుంది. పిల్లుట్ల కంపార పరిధిలో శనివారం పలువురు వ్యక్తులు డోజర్లు, జేసీబీలతో అటవీ భూమిని చదును చేస్తున్నారు. విషయం తెలుసుకున్న అటవీ శాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని 4 డోజర్లు, 2 జేసీబీలను స్వాధీనం చేసుకుని నర్సాపూర్‌ అటవీ కార్యాలయానికి తరలించారు. కేసులు నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని డిప్యూటీ రేంజ్‌ అధికారి సిద్దిరాంసింగ్‌ తెలిపారు. సెక్షన్‌ అధికారులు శ్రీధర్‌ బాబు, రాజమణి, సాయిరాం, బీట్‌ ఆఫీసర్లు కుమార్‌, వెంకటేశ్‌ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement