వేర్వేరు చోట్ల నలుగురు అదృశ్యం | - | Sakshi
Sakshi News home page

వేర్వేరు చోట్ల నలుగురు అదృశ్యం

Aug 24 2025 9:53 AM | Updated on Aug 24 2025 2:14 PM

వేర్వ

వేర్వేరు చోట్ల నలుగురు అదృశ్యం

వేర్వేరు చోట్ల నలుగురు అదృశ్యం పటాన్‌చెరు టౌన్‌: యువకుడు అదృశ్యమైన ఘటన పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఏఎస్‌ఐ అశోక్‌ వివరాల ప్రకారం... మండలంలోని రామేశ్వరం బండ గ్రామానికి చెందిన గోపాల్‌ రామ్‌ కుమారుడు గౌతమ్‌ కుమార్‌ కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈనెల 21న రాత్రి ఇంటికి రాకపోవడంతో అతడికి కుటుంబ సభ్యులు ఫోన్‌ చేశారు. తాను ఇంటికి రానని, తన స్నేహితుడు సాయికిరణ్‌తో గొడవ జరిగిందని, హఫీజ్‌పేట్‌కి వెళ్తున్నానని చెప్పి ఫోన్‌ కట్‌ చేశాడు. తిరిగి ఫోన్‌ చేస్తే స్విచ్‌ ఆఫ్‌ వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు గౌతమ్‌ కోసం తెలిసిన వారు, స్థానికంగా వెతికినా ఆచూకీ లభించలేదు. తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పుల్‌కల్‌(అందోల్‌): ఇంటి నుంచి బయటకు వెళ్లిన వృద్ధుడు అదృశ్యమయ్యాడు. ఎస్‌ఐ విశ్వజన్‌ కథనం ప్రకారం... మండల పరిధిలోని పెద్దారెడ్డిపేటకు చెందిన గంతి కాశీనాథం(65)ఈ నెల 20న మునిపల్లిలోని బంధువుల ఇంటికి వెళుతున్నానని బయలుదేరాడు. కానీ, బంధువుల ఇంటికి వెళ్లలేదు. మూడు రోజుల నుంచి వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పుల్‌కల్‌లో వృద్ధుడు..

ఇంటి నుంచి బయటకు వెళ్లిన బాలిక..

పటాన్‌చెరు టౌన్‌: బయటకు వెళ్లిన బాలిక అదృశ్యమైన ఘటన బీడీఎల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన జిగేన్‌ బతుకుదెరువు కోసం వచ్చి తెల్లాపూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని ఘనపూర్‌ సమీపంలోని ఓ కంపెనీలో కూలి పని పనిచేసుకుంటూ అక్కడే ఉంటున్నారు. ఈ నెల 21న జిగేన్‌ కూతురు ఆసియా ఎవరికి చెప్పకుండా బయటికి వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు స్థానికంగా, తెలిసిన వారి వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు.

నర్సాపూర్‌లో వ్యక్తి..

నర్సాపూర్‌ రూరల్‌: వ్యక్తి అదృశ్యమైన ఘటన నర్సాపూర్‌లో శనివారం వెలుగు చూసింది. ఎస్సై లింగం వివరాల ప్రకారం... పట్టణానికి చెందిన మహమ్మద్‌ అఖిల్‌ అలియాస్‌ మహమ్మద్‌ ఫక్రు పోలీస్‌ స్టేషన్‌ ఎదురుగా మిర్చి బండి నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ నెల19వ తేదీ రాత్రి వరకు మిర్చి బండి నడిపి ఆ తర్వాత ఇంటికి వెళ్లకుండా కనిపించకుండా పోయాడు. కుటుంబ సభ్యులు వెతికినా ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

రైలు ఎక్కుతూ కిందపడి..

మనోహరాబాద్‌(తూప్రాన్‌): రైలు ఎక్కబోయి కిందపడి వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మనోహరాబాద్‌ రైల్వేస్టేషన్‌ వద్ద శనివారం చోటు చేసుకుంది. కామారెడ్డి రైల్వే ఎస్‌ఐ లిబాంద్రి వివరాల ప్రకారం... మండల కేంద్రానికి చెందిన తాడేపు కిష్టయ్య ( 71 ) రైల్వేలో లోకో పైలట్‌గా విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ చేశాడు. కాగా కుటుంబ సభ్యులతో బొల్లారం రైల్వే స్టేషన్‌ దగ్గరలో నివాసం ఉంటున్నాడు. అతడికి వ్యవసాయ పొలం ఉండటంతో గ్రామానికి వచ్చి పనులు ముగించుకుని తిరిగి ఇంటికి వెళుతున్నాడు. ఈ క్రమంలో మనోహరాబాద్‌ రైల్వే స్టేషన్‌ వద్ద బోధన్‌– కాచిగూడ పాసింజర్‌ రైలు కదులుతుండగా బోగిలోకి ఎక్కబోయి అదుపుతప్పి రైలు కింద పడిపోయాడు. ఈ ప్రమాదంలో అతడు రెండు కాళ్లు కోల్పోయాడు. గమనించిన స్థానికులు మేడ్చల్‌లోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. మృతునికి భార్య, కుమారుడు, నలుగురు కుమార్తెలున్నారు.

వేర్వేరు చోట్ల నలుగురు అదృశ్యం1
1/2

వేర్వేరు చోట్ల నలుగురు అదృశ్యం

వేర్వేరు చోట్ల నలుగురు అదృశ్యం2
2/2

వేర్వేరు చోట్ల నలుగురు అదృశ్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement