
మద్యం బాటిళ్ల స్వాధీనం
జహీరాబాద్ టౌన్: గోవా నుంచి అక్రమంగా తీసుకొస్తున్న మద్యం బాటిళ్లను జిల్లా టాస్క్ ఫోర్స్(డీటీఎఫ్), సంగారెడ్డి టీం సభ్యులు సోమవారం పట్టుకున్నారు. మండలంలోని చిరాగ్పల్లి చెక్పోస్టు వద్ద డీటీఎఫ్ బృందం సభ్యులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. ట్రావెల్ బస్సులో తీసుకొస్తున్న వివిధ బ్రాండ్స్కు చెందిన 74 మద్యం బాటిళ్లు(42 లీటర్లు)ను పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న బాటిళ్లను జహీరాబాద్ ఎకై ్సజ్ స్టేషన్కు తరలించారు. తనిఖీల్లో సీఐ వీణారెడ్డి, ఎస్ఐలు హనుమంతు, రమేశ్, మురళి, రాజ, ఉమారాణి ఉన్నారు.