ఏఐతో పంట తెగుళ్ల గుర్తింపు | - | Sakshi
Sakshi News home page

ఏఐతో పంట తెగుళ్ల గుర్తింపు

May 9 2025 8:15 AM | Updated on May 9 2025 8:15 AM

ఏఐతో పంట తెగుళ్ల గుర్తింపు

ఏఐతో పంట తెగుళ్ల గుర్తింపు

ములుగు కొండా లక్ష్మణ్‌ ఉద్యానవర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌

ములుగు(గజ్వేల్‌): కృత్రిమ మేథ(ఏఐ), రోబోటిక్స్‌, డ్రోన్‌ల ఏకీకరణ ద్వారా పంట దిగుబడి, తెగుళ్లు, వ్యాధుల అంచనా వేయవచ్చని ములుగు కొండా లక్ష్మణ్‌ ఉద్యానవర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ డాక్టర్‌ దండా రాజిరెడ్డి అన్నారు. ఈ మేరకు ములుగు ఉద్యాన వర్సిటీలో గురువారం హైదరాబాద్‌కు చెందిన మారుత్‌ డ్రోన్స్‌ సంస్థతో ఉద్యాన పంటలపై పరిశోధన, అభివృద్ధి, శిక్షణలో సహకారం పెంపొందించడానికి అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యానవన ఉత్పత్తిలో తెలంగాణ అగ్రగామిగా ఎదుగుతున్నదని తెలిపారు. డ్రోన్‌ ఆధారిత సాంకేతికత సామర్థ్యాన్ని ఉపయోగించి పంట పర్యవేక్షణ, తెగులు, వ్యాధుల అంచనా స్థిరమైన వ్యవసాయ పద్ధతులను మెరుగు పరచడం లక్ష్యంగా పెట్టుకున్నదని తెలిపారు. ఈ ఒప్పందం ప్రకారం ఆరు ప్రధాన ఉద్యాన పంటలు మిర్చి , పసుపు, టమోటా, వంకాయ, ఆయిల్‌పామ్‌, మామిడి పరిశోధన శిక్షణ కార్యక్రమాలు సాంకేతిక అభివృద్ధిపై సంయుక్తంగా పనిచేస్తాయన్నారు. కార్యక్రమంలో మారుత్‌ డ్రోన్‌ కో ఫౌండర్‌ ప్రేమ్‌ కుమార్‌, ఉద్యానవర్సిటీ అధికారులు భగవాన్‌, చీనా నాయక్‌, లక్ష్మినారాయణ, సురేశ్‌కుమార్‌, శ్రీనివాసన్‌, వీణాజ్యోతి, సతీశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement