తండ్రీకొడుకుల శ్వాస.. కడవరకూ కలిసే.. | - | Sakshi
Sakshi News home page

ప్రమాదంలో కొడుకు.. గుండెపోటుతో తండ్రి.. ఒకే గంటలో మృత్యువు..

Aug 6 2023 6:32 AM | Updated on Aug 6 2023 11:39 AM

- - Sakshi

సంగారెడ్డి: రోడ్డు ప్రమాదంలో కొడుకు మృతిచెందటాన్ని తట్టుకోలేని తండ్రి గుండెపోటుతో మృతిచెందాడు. ఒకే ఇంట్లో ఇద్దరి మృతితో ఆ తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా పుల్కల్‌ మండల పరిధిలోని గొంగ్లూర్‌ తండాలో శనివారం జరిగింది.

తండాకు చెందిన భీమ్లానాయక్‌ (55) వ్యవసాయం చేసుకునేవాడు. అతడి బోరు మోటారు చెడిపోవడంతో శుక్రవారం జోగిపేటలో మరమ్మతులు చేసుకుని ద్విచక్రవాహనంపై తిరుగు ప్రయానమవుతున్నాడు. మార్గమధ్యలో గుర్తుతెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతిచెందాడు. ప్రమాదం విషయం తెలుసుకున్న కుటుంబీకులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.

అతడి మృతదేహాన్ని జోగిపేట ఆస్పత్రి మార్చురీకి తరలించారు. కుమారుడు విగతజీవిగా చూసి తట్టుకోలేక తండ్రి ధర్మానాయక్‌ (75) గుండెపోటుకు గురయ్యాడు. సంగారెడ్డిలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ తుదిశ్వాస వదిలాడు. గంటల వ్యవధిలోనే తండ్రీకొడుకులు మృతిచెందడంతో గొంగ్లూర్‌ తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి. శనివారం వారి అంత్యక్రియలు నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement