ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

మాట్లాడుతున్న రామాచార్య  - Sakshi

ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ రామాచార్య

ఝరాసంగం(జహీరాబాద్‌): ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ ఎస్‌బీ రామాచార్య సూచించారు. సోమవారం మండల పరిధిలోని బిడెకన్నె గ్రామంలో నిర్వహించిన సమావేశానికి హాజరై మాట్లాడారు. పీఎం ఏజేఏవై పథకం అసైన్డ్‌ భూమి ఉన్న రైతులకు మాత్రమే వర్తిస్తుందన్నారు. ఇందులో భాగంగా 100 శాతం సబ్సిడీతో బోరు బావులు తవ్వించి మోటారు సైతం ఏర్పాటు చేసి విద్యుత్‌ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ పథకం కింద గ్రామంలో 300 మందిని గుర్తించినట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో గ్రౌండ్‌ వాటర్‌ డీడీ వెంకటేశ్వర్‌రావు, పంచాయతీ కార్యదర్శి శివశంకర్‌, తదితరులు పాల్గొన్నారు.

Read latest Sangareddy News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top