ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

Mar 28 2023 6:10 AM | Updated on Mar 28 2023 6:10 AM

మాట్లాడుతున్న రామాచార్య  - Sakshi

మాట్లాడుతున్న రామాచార్య

ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ రామాచార్య

ఝరాసంగం(జహీరాబాద్‌): ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ ఎస్‌బీ రామాచార్య సూచించారు. సోమవారం మండల పరిధిలోని బిడెకన్నె గ్రామంలో నిర్వహించిన సమావేశానికి హాజరై మాట్లాడారు. పీఎం ఏజేఏవై పథకం అసైన్డ్‌ భూమి ఉన్న రైతులకు మాత్రమే వర్తిస్తుందన్నారు. ఇందులో భాగంగా 100 శాతం సబ్సిడీతో బోరు బావులు తవ్వించి మోటారు సైతం ఏర్పాటు చేసి విద్యుత్‌ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ పథకం కింద గ్రామంలో 300 మందిని గుర్తించినట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో గ్రౌండ్‌ వాటర్‌ డీడీ వెంకటేశ్వర్‌రావు, పంచాయతీ కార్యదర్శి శివశంకర్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement