రాష్ట్రస్థాయి హ్యాండ్‌ బాల్‌ పోటీలకు ఎంపిక

అనిరుధ్‌తో స్కూల్‌ ప్రిన్సిపాల్‌, పీఈటీ - Sakshi

ొండాపూర్‌(సంగారెడ్డి): 37 సబ్‌ జూనియర్‌ రాష్ట్రస్థాయి హ్యాండ్‌ బాల్‌ పోటీలకు సంగారెడ్డి పట్టణంలోని సెయింట్‌ ఆంథోనీస్‌ స్కూల్‌ విద్యార్థి ఎంపికై నట్లు విద్యా సంస్థల అధినేత సాల్మన్‌రెడ్డి గురువారం తెలిపారు. పాఠశాలకు చెందిన విద్యార్థి అనిరుధ్‌ ఈ నెల 10నుంచి 12వ తేదీ వరకు నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌లో జరిగే రాష్ట్రస్థాయి హ్యాండ్‌ బాల్‌ పోటీల్లో పాల్గొంటాడని తెలిపారు. ఈ సందర్భంగా అనిరుధ్‌ను అభినందించారు. కార్యక్రమంలో విద్యా సంస్థల అసిస్టెంట్‌ డైరెక్టర్‌ విజయ్‌ కుమార్‌ రెడ్డి, ప్రిన్సిపాల్‌ కరుణాకర్‌ రెడ్డి, జయబాలరెడ్డి, వైస్‌ ప్రిన్సిపాల్‌ అరుణారెడ్డి తదితరులున్నారు.

కోర్టు సిబ్బందికి

సన్మానం

సిద్దిపేటకమాన్‌: అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని సిద్దిపేట జిల్లా కోర్ట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కార్యాలయంలో ట్రైనీ కలెక్టర్‌ ఫైజాన్‌, ఏసీపీ దేవారెడ్డి, ఎస్‌ఐ శ్రీరామ్‌, జిల్లా పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ వెంకటలింగం మహిళా అధికారులు, సిబ్బందిని గురువారం ఘనంగా సన్మానించారు. జిల్లా కోర్టు ఏఓ మాధవి, ఏపీపీ రూపా, కరుణశ్రీ, మహిళా పోలీసు స్టేషన్‌ సీఐ దుర్గ, భరోసా సెంటర్‌ లీగల్‌ అడ్వైజర్‌ సౌమ్య, తొగుట సర్కిల్‌ కోర్టు కానిస్టేబుల్‌ లావణ్యను అధికారులు సన్మానించారు. కార్యక్రమంలో కోర్టు లైజనింగ్‌ ఆఫీసర్లు రాధాకష్ణ, స్వామిదాస్‌, కోర్టు కానిస్టేబుల్‌ వేణుగోపాల్‌, రవికుమార్‌, బాపురెడ్డి, రామరాజు, అంజిరెడ్డి, యాదగిరి, రవి, శ్రీనివాస్‌, శివ, దేవేందర్‌, వినయ్‌, సంపత్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Sangareddy News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top