స్టేటస్‌పెట్టుకుంటే డబ్బులిస్తాం! | WhatsApp scam: Telangana | Sakshi
Sakshi News home page

స్టేటస్‌పెట్టుకుంటే డబ్బులిస్తాం!

Jun 2 2025 1:44 AM | Updated on Jun 2 2025 1:44 AM

WhatsApp scam: Telangana

నయా దందా మొదలుపెట్టిన సైబర్‌ మోసగాళ్లు 

కొన్ని ఫొటోలు పంపి వాట్సాప్‌ స్టేటస్‌ పెట్టాలని సూచన 

ఒక్కో వ్యూకి రూ. 2 చొప్పున లెక్కకట్టి ఇస్తామని గాలం 

రూ.300 చొప్పున సభ్యత్వ రుసుం పేరిట వసూలు 

ఆరుగురిని చేర్పిస్తే మీ డబ్బు మాఫీ అవుతుందని బురిడీ 

వేలాది మంది నుంచి డబ్బు కొల్లగొడుతున్న కేటుగాళ్లు 

చిన్నమొత్తాలు కావడంతో పోలీసులను ఆశ్రయించని బాధితులు

సైబర్‌ నేరగాళ్లు రూటు మార్చారు. ‘తక్కువ మొత్తం.. ఎక్కువ మంది నుంచి వసూలు’అనే సరికొత్త మోసతంత్రాన్ని తెరపైకి తెచ్చారు. నగరాల్లో సైబర్‌ మోసాలపై క్రమంగా అవగాహన పెరుగుతుండటంతో సైబర్‌ నేరగాళ్లు క్రమంగా ద్వితీయశ్రేణి పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలను ఎంచుకుంటున్నారు. వాట్సాప్‌ వాడటం అన్ని ప్రాంతాల్లో పరిపాటిగా మారడంతో దాన్నే ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు. తాము పంపిన ఫొటోలను వాట్సాప్‌ స్టేటస్‌గా పెట్టుకుంటే మీ బ్యాంకు ఖాతాల్లో కాసులు వచ్చిపడతాయని బురిడీ కొట్టిస్తున్నారు.

వాట్సాప్‌ స్టేటస్‌గా పెట్టిన ఫొటోలను వ్యూ, లైక్, కామెంట్‌.. ఇలా ఒక్కో టాస్క్కు రూ. 2 చొప్పున మీ బ్యాంకు ఖాతాలో జమ అవుతాయని ప్రచారం చేస్తున్నారు. ఇదంతా జరగాలంటే ముందుగా రిజి్రస్టేషన్‌ ఫీజు కింద రూ. 300 తాము చెప్పిన ఫోన్‌ నంబర్‌కు పంపాలని సూచిస్తున్నారు. వాటిని నమ్మి వాట్సాప్‌ స్టేటస్‌ టాస్క్ ముందుకొచ్చే వారి నుంచి ముందుగా రూ. 300 వసూలు చేయడమే కాకుండా మరో ఆరుగురిని చేరిస్తే కట్టిన రూ. 300 తిరిగి ఇస్తామని ఊదరగొడుతున్నారు. క్రమంగా మల్టీలెవల్‌ మార్కెటింగ్‌ తరహాలో చైన్‌ను ఏర్పాటు చేస్తూ అమాయకుల నుంచి అందినకాడికి దోచుకుంటున్నారు. తాండూరు ప్రాంతంలో ఈ తరహా సైబర్‌ మోసం తాజాగా వెలుగులోకి వచ్చింది. మారింది. వేలాది మంది ఈ తరహాలో డబ్బులు పోగొట్టుకున్నట్లు తెలుస్తోంది. - సాక్షి, హైదరాబాద్‌

బాధితులు ఫిర్యాదు చేయకపోవడంతో..
సైబర్‌ మోసగాళ్లు చెప్పే మాటలు నమ్మి బాధితులంతా రూ.300 చొప్పున వారు చెప్పే గూగుల్‌ పే, ఫోన్‌ పే నంబర్లకు చెల్లిస్తున్నారు. ఇందులో ఒకరిద్దరికి రూ. 300 తిరిగి ఇస్తున్న నేరగాళ్లు... ఎక్కువ మంది నుంచి డబ్బులు దండుకోవడమే పనిగా పెట్టుకుంటున్నారు. వాట్సాప్‌ స్టేటస్‌ను నెలపాటు పెట్టుకోవడంతోపాటు ప్రతిరోజూ స్కీన్ర్‌ షాట్‌ పంపాలని నిబంధన విధించడం.. చివరకు నిబంధనలు పాటించనందున మళ్లీ మొదటి నుంచి చేయాలంటూ అమాయకులను మోసగిస్తున్నారు. ఈ తరహా మోసాలు ప్రధానంగా తాండూరు, వికారాబాద్‌ ప్రాంతంలో ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. అయితే బాధితులంతా ఇంత చిన్నమొత్తానికి పోలీసులకు ఏం ఫిర్యాదు చేస్తాంలేనని వదిలేస్తుండటం సైబర్‌ నేరగాళ్లకు వరంగా మారుతోంది. బాధితుల సంఖ్య పెరిగేకొద్దీ సైబర్‌ నేరగాళ్లు కొల్లగొడుతున్న సొమ్ము రూ. లక్షల్లోకి చేరుతోంది.

తెలిసిన వాళ్లు చెబితే డబ్బు కట్టాం 
మాకు తెలిసిన వ్యక్తి ద్వారా వాట్సాప్‌ స్టేటస్‌ పెడితే డబ్బులు వస్తాయని తెలిసి మేం కూడా రూ. 300 ఫీజు ఆన్‌లైన్‌లో కట్టి రుద్ర టెక్నాలజీ పేరిట వాట్సాప్‌ గ్రూప్‌లో చేరాం. ఆ తర్వాత 30 ఫొటోలు వచ్చాయి. రోజుకు ఒకటి చొప్పున వాట్సాప్‌ స్టేటస్‌గా పెట్టుకున్నాం. కానీ ఆ తర్వాత డబ్బులు తిరిగి రాలేదు. – సుదర్శన్‌రెడ్డి, తాండూరు

ఐదుగురిని చేర్పించి మోసపోయా
వికారాబాద్‌లో ఓ స్నేహితుడి ద్వారా రూ. 300 ఆన్‌లైన్‌లో పంపా. 30 రోజులపాటు ఫొటోలు పెట్టాక డబ్బులు అడిగితే టాస్క్‌ సరిగా చేయలేదన్నారు. గ్రూప్‌లో ఐదుగురిని చేరి్పస్తే వెంటనే డబ్బులు వస్తాయని ఆశపెట్టడంతో ఐదుగురిని చేరి్పంచా. అయినా నాతోపాటు ఆ ఐదుగురి డబ్బులు కూడా పోయాయి. 
– నీరటి నరేశ్‌కుమార్, కొత్తూరు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement