అయ్యవారిపల్లి వాగులో వరద ఉధృతి | - | Sakshi
Sakshi News home page

అయ్యవారిపల్లి వాగులో వరద ఉధృతి

Aug 9 2025 8:34 AM | Updated on Aug 9 2025 8:34 AM

అయ్యవారిపల్లి వాగులో వరద ఉధృతి

అయ్యవారిపల్లి వాగులో వరద ఉధృతి

షాద్‌నగర్‌రూరల్‌: భారీ వర్షాలకు వాగులు, వంకలు పారుతున్నాయి. గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ఫరూఖ్‌నగర్‌ మండల పరిధిలోని అయ్యవారిపల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో వాహనాలు రాకపోకలు నిలిచిపోయాయి. చించోడ్‌ గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రదంలోకి వర్షపు నీరు చేరింది. ఈ విషయాన్ని తెలుసుకున్న ఎంపీడీఓ బన్సీలాల్‌ శుక్రవారం అంగన్‌వాడీ కేంద్రం, వాగు పరిసరాలను పరిశీలించారు. వాగు సమీపంలోకి ప్రజలు వెళ్లకుండా బారీకేడ్లు ఏర్పాటు చేయించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ.. ప్రజలు వాగు సమీపంలోకి రావద్దని హెచ్చరించారు. అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అయ్యవారిపల్లికి ప్రయాణించేవారు మరో మార్గం ఎంచుకోవాలని చెప్పారు. వాగును పరిశీలించిన వారిలో ఎంపీఓ జయంత్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి భూపాల్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

రాకపోకలు నిలిపివేసిన అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement