మరణంలోనూ జంటగా.. | - | Sakshi
Sakshi News home page

మరణంలోనూ జంటగా..

Aug 8 2025 9:13 AM | Updated on Aug 8 2025 9:13 AM

మరణంలోనూ జంటగా..

మరణంలోనూ జంటగా..

షాబాద్‌: ఆ అన్యోన్య దంపతుల బంధాన్ని మృత్యువు సైతం వేరు చేయలేకపోయింది. భర్త మరణాన్ని తట్టుకోలేని భార్య గంటల వ్యవధిలోనే ప్రాణాలు వదిలేసింది. ఈ ఘటన హైతాబాద్‌లో చోటు చేసుకుంది. గ్రామస్తుల వివరాల ప్రకారం.. నగరానికి చెందిన అన్నె ప్రసాద్‌రావు(83), పార్వతి (72) దంపతులు హైతాబాద్‌లో ఉంటున్నారు. బుధవారం రాత్రి ప్రసాద్‌రావు అస్వస్థతకు గురికావడంతో శంషాబాద్‌లోని ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. ఈ విషయం తెలియగానే తీవ్ర మానసిక క్షోభకు గురైన పార్వతి గుండెపోటుతో మరణించింది. స్థానిక శ్మశానవాటికలో గురువారం ఇద్దరి అంత్యక్రియలను ఒకేసారి నిర్వహించారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement