30 నుంచి రాచకొండ పరిధిలో ఆంక్షలు | - | Sakshi
Sakshi News home page

30 నుంచి రాచకొండ పరిధిలో ఆంక్షలు

Mar 29 2023 4:02 AM | Updated on Mar 29 2023 4:02 AM

శ్రీరామ నవమి ఉత్సవాలు,

రంజాన్‌ మాసం, ఉప్పల్‌లో ఐపీఎల్‌ మ్యాచ్‌ల నేపథ్యంలో..

ఉప్పల్‌: రాచకొండ కమిషనరేట్‌ పరిధిలోని అన్ని పోలీస్‌స్టేషన్ల పరిధిలో ఈ నెల 30 నుంచి సభలు సమావేశాలు, ర్యాలీలపై ఆంక్షలు విధిస్తున్నట్లు రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ డీఎస్‌ చౌహాన్‌ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ముందస్తు అనుమతి లే కుండా కమిషనరేట్‌ పరిధిలో ఎలాంటి సభలు, సమా వేశాలు ఏర్పాటు చేయరాదని సూచించారు. శ్రీరామ నవమి ఉత్సవాలు, రంజాన్‌ మాసం, ఉప్పల్‌లో జరగనున్న ఐపీఎల్‌ మ్యాచ్‌ల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఏప్రిల్‌ 3 వ తేదీ ఉదయం వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు.

30న మద్యం దుకాణాల

బంద్‌

శ్రీరామ నవమి ఉత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 30న రాచకొండ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో కల్లు దుకాణాలు, వైన్‌ షాపులు, బార్‌ అండ్‌ రెస్టారెంట్‌లు, మిలిటరీ క్యాంటిన్‌లు సైతం మూసి వేస్తున్నట్లు సీపీ పేర్కొన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement